మహారాష్ట్ర నాసిక్లో ఆర్పీఎఫ్ జవాన్ల క్యాంపు దరిదాపుల్లో ఏటీఎమ్ మెషన్ కలదు. దొంగలు డబ్బుల దోచే క్రమంలో ఏటీఎం బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. కానీ అది పగలకపోవడంతో మెషిన్ ను ట్రక్కులోకి ఎక్కించుకుని పారిపోయారు.
ఈ రోజుల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ చైన్ స్నాచర్స్ తెగబడ్డారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దొరికినంత దోచేస్తున్నారు. లగ్జరీ లైఫ్కు అలవాటుపడి తమ అవసరాలకు ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన విషయమేమంటే కొందరు బాగా చదువుకున్నవారు కూడా దొంగతనాలను పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దొంగలు చెలరేగిపోతున్నారు. ఏటీఎం నుండి డబ్బులు దొంగతనం చేయడానికి ప్రయత్నించగా విఫలమైనారు. ఏకంగా ఏటీఎం మెషన్నే లారీలోకి ఎక్కించుకుని ఎత్తుకుపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు దొంగతానికి ప్రయత్నించారు. సమన్గావ్ ప్రాంతంలో ఆర్ పీ ఎఫ్ క్యాంపు సమీపంలో గల ఏటీఎంను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. లారీ తెచ్చి ఏటీఎం మెషన్ ను లారీలోకి ఎక్కించుకుని పరారయ్యారు. ఆర్ పీ ఎఫ్ సమీపంలో దొంగతనం జరగడం అందరిని ఆశ్చర్యపరిచే విషయం. ఏటీఎం దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా క్రైమ్ డిపర్ట్మెంట్ సీనియర్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా దొంగిలించిన ఏటీఎం మెషన్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో స్పష్టంగా తెలియదు.
ఈ క్యాంపు కార్యాలయం పట్టణానికి దూరంలో ఉండడం వల్ల జవాన్లు నగదు ఉపసంహరించుకునేందుకు వెసులుబాటుగా ఈ ఏటీఎంను ఏర్పాటు చేయించారు. సమన్గావ్ క్యాంపుకు దేశ నలుమూలల నుండి ఆర్ పీ ఎఫ్ జవాన్లు ట్రైనింగ్ కోసం వస్తుంటారు. అంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఇలాంటి ప్రదేశాల్లోనే దొంగతనాలు జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటో మరి!