ఒకప్పుడు బ్యాంకుల్లో ఎక్కువగా చోరీలు జరిగేవి. ఖాతాదారుల సొమ్మును భద్రంగా దాచే బ్యాంకులను కేటుగాళ్లు టార్గెట్ చేసేవారు. పక్కా ప్లానింగ్తో బ్యాంకుల్లో నుంచి లక్షలాది రూపాయలను కొట్టేసేవారు. బ్యాంకు చోరీ కేసుల్లో చాలా మంది దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు, వారికి కోర్టులు శిక్షలు కూడా విధించాయి. కానీ ఈ తరహా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఏటీఎంలు వచ్చినప్పటి నుంచి బ్యాంకుల్లో దొంగతనాలు తగ్గాయనే చెప్పొచ్చు. అయితే ఏటీఎంల్లో దొంగతనాలు పెరిగాయి. రాత్రిపూట ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని లూటీ చేయడం ఈమధ్య ఎక్కువైపోయింది. కొన్ని ఘటనల్లో ఏటీఎంల్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకున్న వినియోగదారుల దగ్గర నుంచి డబ్బులు దోచేయడం గురించి కూడా వింటున్నాం. మరికొన్ని ఘటనల్లో అయితే ఏటీఎం మిషన్లను పగులగొట్టడం.. కుదరకపోతే వాటిని ఎత్తుకెళ్లడం కూడా చేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. గురువారం రాత్రి పట్టణంలోని రెండు వేర్వేరు ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం మిషన్లను ఎత్తుకెళ్లి.. వాటిల్లో నుంచి భారీగా నగదును లూటీ చేశారు. ఆరెయిన్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లిన ఏటీఎం మిషన్ లో రూ.8 లక్షలు, రూపన్గఢ్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లిన ఏటీఎం మిషన్లో రూ.30 లక్షలు ఉన్నాయని ఆఫీసర్స్ చెప్పారు. ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు దొంగలు ఆ రెండు ఏటీఎం సెంటర్స్లో చొరబడి ఏటీఎం మిషన్లను పెకిలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రెండు ఏటీఎంల్లోనూ జరిగిన దొంగతనాలు ఒకేలా ఉండటంతో అది ఒకే దొంగల ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టారు.
#WATCH Thieves uprooted ATM machine & looted cash yesterday in Ajmer, Rajasthan
ATM machines looted in Arain & Roopangarh. Rs. 8 Lakhs & Rs. 30 Lakhs were stolen. Robbery method in both cases identical so it could be same gang: Vaibhav Sharma, Additional SP, Rural pic.twitter.com/CszNQ28A91
— ANI (@ANI) January 27, 2023