ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్లో ఓ వింత ఘటన జరిగింది. కోర్టు ఆదేశాలతో తనతో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసుకున్నారు ఓ పోలీసు అధికారి.
ఏదైనా గొడవ జరిగినప్పుడు పోలీసులు ఎంటరై సమస్యను పరిష్కరిస్తారు. లేదా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఆ కేసును కొన్ని రోజుల వ్యవధిలో ఛేదిస్తారు. అంతే గాని తనపై తానే కేసు నమోదు చేసుకోవడం ఏంటనుకుంటున్నారా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందికాదా.. కానీ ఇది నిజమేనండీ.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్లోనికోల్హూయి పోలీస్ స్టేషన్ పరిధిలో బఢహర శివనాథ్ గ్రామంలో సూర్య ప్రకాశ్ చౌదరి నివాసముంటున్నాడు. అతని భార్య సీమ డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలిగా ఉంది. డ్వాక్రా గ్రూప్ అధ్యక్షురాలు షీలాదేవి. షీలాదేవి భర్త గ్రామ సర్పంచ్గా విధులు వ్యవహరిస్తున్నారు. షీలాదేవి డ్వాక్రా డబ్బులు రూ.15000 కాజేసింది. ఈ విషయం తెలిసిన సభురాలు సీమ డ్వాక్రా డబ్బులు లెక్కలు చూపించాలని నిలదీసింది. దీంతో షీలాదేవి భర్త మెహిత్ యాదవ్ తన అనుచరులతో సీమ ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషించి.. చంపుతానని బెదిరించారు. దాడి జరిగిన వెంటనే సీమ భర్త సూర్యప్రకాశ్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. షీలాదేవి, భర్త మెహిత్ యాదవ్లపై ఫిర్యదు ఇచ్చాడు. పోలీసులు ఆయన ఫిర్యాదును తీసుకోలేదు. పైగా సూర్యప్రకాశ్ను స్టేషన్ నుంచి తరిమేశారు. పోలీసుల తీరుకు ఆగ్రహించి కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. కోర్టు విచారించి.. కోల్హూయి పోలీస్ స్టేషన్ ఎస్ ఐతో సహా గ్రామ సర్పంచ్ మెహిత్, భార్య షీలాదేవి, మరో 14 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనుసరించి తనతో పాటు మరో 14 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీస్ అధికారి.
డ్వాక్రా లీడర్ షీలాదేవి గూపులోని డబ్బులను కాజేసింది కాకుండా అన్యాయంగా సీమ ఇంటిపై దాడికి పాల్పడడం తప్పుగా కోర్లు భావించింది. అధికారం చేతిలో ఉందికదా అని షీలా భర్త గ్రామ సర్పంచ్ హోదాలో ఉందికూడా న్యాయం చేయకుండా అన్యాయానికి తెగించారు. అందుకుగాను సీమ భర్త సూర్యప్రకాశ్ కోర్టుకెళ్లి మంచిపని చేశాడని ఊరివాళ్లు, డ్వాక్రా గ్రూపు సభ్యులు సూర్యప్రకాశ్ ని అభినందించారు. కోర్టు న్యాయం చేసినందుకు న్యాయవ్యవస్థను గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో తనపై తాను కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారి ఘటనపై మీ కామెంట్స్ తెలియజేయండి.