సమాజంలో ప్రేమ పేరుతో యువతులను మోసం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని రెండు రోజుల్లోనే ప్రేమ పుట్టడం.. ఆ తర్వాత శారీరకంగా దగ్గర అవ్వడం.. ఆ తర్వాత విడిపోవడం చేస్తున్నారు.
సమాజంలో ప్రేమ పేరుతో యువతులను మోసం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని రెండు రోజుల్లోనే ప్రేమ పుట్టడం.. ఆ తర్వాత శారీరకంగా దగ్గర అవ్వడం.. ఆ తర్వాత విడిపోవడం చేస్తున్నారు. కొంత మంది పెళ్లి పేరుతో యువతలకు దగ్గరై.. వారి కోర్కెలు తీర్చుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే దూరం పెట్టడం. ఇలాంటి ఘటనలు తరచు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా సినీరంగంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. జబర్దస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితాలను ఇచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ చిత్రసీమకు పరిచమై రాణిస్తున్నారు. ఇందులో నవ సందీప్ ఒకడు. కమెడియన్ గానే కాకుండా సింగర్ గా, కూడా జనాలను అలరిస్తున్నాడు. అయితే ఇటివలే ఓ అమ్మయితో ప్రేమలో పడి పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకొని ఆమెను మోసం చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ కమెడియన్, సింగర్ నవ సందీప్పై పోలీస్ కేసు నమోదైంది. తనను ప్రేమించానని చెప్పి శారీరకంగా వాడుకొని సందీప్ మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ సందీప్కు 2018లో వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ యవతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఆ తర్వాత సినిమాలకు , శికార్లకు చెట్టపాట్టాలు వేకసుకొని తిరిగారట. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అని కమిటయ్యిందట. ఇలాగే కొన్ని రోజుల వరకు సహజీవనం చేశారట. అయితే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అని నవ సందీప్ తో చెప్పిందట. కట్ చేస్తే ఆ రోజు నుండి నో కాల్, నో మెసేజ్.
అతన్ని ఏదో విధంగా కలుసుకోని తనతో మాట్లడాలని..ఎందుకు దూరం పెడుతున్నావని అడుగుదాం అంటే సందీప్ దోరకడం లేదట. అతడిని కలుసుకోవడం సాధ్యం కాదని తెలుసుకోని తన దగ్గరున్న సాక్ష్యాలను తీసుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని సమాచారం. సందీప్ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను వాడుకున్నాడని ఆ ఫిర్యాదులో తెలిపింది. అయితే మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసరట. ఆ యువతి చెప్పేది నిజమా.. కాదా.. అని అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.