ఈ మద్య కొంతమంది డబ్బు కోసం హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేస్తూ నిర్వాహకులను, విటులను అరెస్ట్ చేస్తున్నారు.
ఈ మద్య చాలా మంది డబ్బు కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్, అక్రమ వ్యాపారాలు, హైటెక్ వ్యభిచారం చేస్తూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు. ప్రముఖ నగరాల్లో కొంతమంది అపార్ట్ మెంట్స్ తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ లో విటులను ఆకర్షించి అందినంత దోచుకుంటున్నారు. మరికొంతమంది స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తునారు. పైకి మాత్రం మసాజ్ బోర్డు.. లోపల అంతా వ్యభిచారం దందా నిర్వహిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన మైసూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల పెద్ద పెద్ద నగరాల్లో కొంతమంది స్పా సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మైసూర్లో పైకి మసాజ్ సెంటర్ అని బోర్డులు పెట్టి లోపల గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం దందా చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొంతకాలంగా మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రం మసాజ్ సెంటర్ పై దాడిచేశారు. ఈ రైడ్ లో ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ వ్యభిచార దందాను కేరళాకు చెందిన రామ్శాంత్ (22) నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలు వేలూరు జిల్లాకు చెందినవారుగా తేలింది.
ఇక హైదరాబాద్ లో సైతం పోలీసలు పలు మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పపడుతున్న వారిని అరెస్ట్ చేశారు. అమ్మాయిలకు సినిమా ఆఫర్లు, ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి.. వారికి మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. స్పా, మసాజ్ సెంటర్లు, కొన్ని అపార్ట్ మెంట్స్ తీసుకొని గుట్టుగా వ్యభిచారం చేయిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు దళారులు. పోలీసులు దాడులు నిర్వహించి కొంతమంది యువతులను కాపాడుతు సంరక్షణ కేంద్రాలకు పంపుతున్నారు. ఇటీవల బంజారాహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో భారీ వ్యభిచార రాకెట్ ను కమిషనర్ టాస్క్ఫోర్స్ బృందం ఛేదించింది. ముగ్గురు నిర్వాహకులు, 18 మంది కస్టమర్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా పది మంది మహిళలను రక్షించి సంరక్షణ కేంద్రానికి పంపించారు.