ఉత్తరప్రదేశ్ లో ఓ తండ్రి తన కన్న కొడుకును తన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోలేక అప్పులపాలయ్యాడు. చివరకు తన కొడుకును అమ్ముకున్నాడు. ఈ ఘటన సీఎం వరకు వెళ్లింది.
చాలామంది జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. అందరికి అన్ని సదుపాయాలు ఉండవు. కొన్ని సమకూర్చుకోవాలి. కొన్ని కలిసివస్తాయి. కొందరి జీవితాలు ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం చేస్తాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అనుకోకుండా జాబ్ లు పోయినా.. ఉన్న ఫలంగా జరగకూడనిది ఏది జరిగినా కూడా ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. ఆ పరిస్థితి సెట్ కావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకు నిత్యావసరాలు తీరే దారులు కూడా కనుమరుగవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేవరకు సమస్యలు తప్పవు. అయితే కొన్నిచోట్ల కన్న కూతుర్లను , కొడుకులను అమ్మేస్తున్నారు. ఎందుకంటే వారిని పోషించే స్తామత లేక వారిని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ తండ్రి తన కన్న కొడుకును తన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోలేక అప్పులపాలయ్యాడు. చివరకు తన కొడుకును అమ్ముకున్నాడు. ఈ ఘటన సీఎం వరకు వెళ్లింది. పూర్తి వివరాలలోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్లో ఓ తండ్రి తన కొడుకును అమ్మేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతుళ్ల పెళ్లి కోసం డబ్బులు కావాలని.. అతని కొడుకుని అమ్మేశాడు. వినడానికి ఈ వార్త వింతగా ఉన్న నిజంగా జరిగిన సంఘటన ఇది. తన ఇద్దరు సోదరీమణులు, కూతుళ్లను పెంచి పోషించే స్థోమత లేక తండ్రి సంజయ్ సైనీ అప్పులపాలయ్యాడు. ఓ చీటీపై తన గోడును రాసి సీఎం యోగికి చెప్పుకున్నాడు. సంజయ్ ప్రకారం.. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తనకు తమలపాకుల దుకాణం కలదు. కుటుంబాన్ని నడిపించడానికి ఆ షాప్ ఒక్కటే ఆధారం. అదికూడా రౌడీలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని .. వారికి ఉన్న జీవనాధారం కూడా లాగేసుకుంటున్నారని తెలిపాడు. జీవనోపాధి పొందే మార్గం కనిపించని స్థితిలో తన కన్న కొడుకును అమ్మేయాల్సి వచ్చిందని లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.