ఇప్పుడు అందరి జీవితాల్లో కామన్గా మారిపోయింది మొబైల్ ఫోన్. ఒక్క క్లిక్తో ప్రపంచాన్ని మన ముందుంచే డివైజ్గా ఫోన్లను చెప్పొచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్స్ను వాడుతున్నారు. అలాంటి ఫోన్లను అమ్మాయిలు వాడకుండా ఒక గ్రామంలో నిషేధం విధించడం హాట్ టాపిక్గా మారింది.
మొబైల్ ఫోన్లు ఇప్పుడు అందరి జీవితాల్లో సాధారణమైపోయాయి. పొద్దున లేస్తే మొబైల్లో అప్డేట్లు చూడనిదే ఆ రోజు మొదలవ్వడం లేదంటే నమ్మండి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ను ఎన్నిసార్లు చూస్తామనే దానికి లెక్కేలేదు. టైమ్ ఎంతవుతుందో చూడాలన్నా ఫోనే.. ఓ సినిమా చూడాలన్నా ఫోనే, పాట వినాలన్నా మొబైలే సాధనమైపోయింది. ఫొటోలు, వీడియోలు లాంటి ఆప్షన్లు.. గేమింగ్ ఫీచర్లు వీటిని యువత, పిల్లలకు దగ్గర చేశాయి. అందుకే అన్ని వయస్కుల వాళ్లూ వీటికి అడిక్ట్ అయిపోయారు. ఇక, ఫోన్లలో కాల్స్, మెసేజెస్ సౌలభ్యం అందులో ఎలాగూ ఉండనే ఉంది.
జేబులో డబ్బులు లేకున్నా ఫోన్ ఉంటే చాలు.. యూపీఐ పేమెంట్స్ యాప్తో స్కాన్ చేసి ఏదైనా కొనుక్కోవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఫోన్ చేతిలో ఉంటే చాలు.. అన్నీ ఉన్నట్లే అనేలా పరిస్థితి తయారైంది. అలాగని మొబైల్స్ మంచివని కాదు. వాటి వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. అనర్థాలు కూడా అనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. అందరి జీవితాల్లో అత్యంత ఆవశ్యకమైన వస్తువుగా మారిపోయిన ఫోన్లను వాడొద్దని ఓ గ్రామంలో నిర్ణయించారు. పెళ్లీడుకొచ్చిన యువతులు మొబైల్స్ వాడొద్దని గుజరాత్లోని బనస్కంత జిల్లా, భాభర్ తాలూకాలోని లున్సేలా గ్రామంలోని ఠాకూర్ కమ్యూనిటీ తీర్మానించింది.
ఫోన్ల వాడకం వల్ల ప్రేమ వ్యవహారాలు, కులాంతర వివాహాలు లాంటివి జరుగుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ కమ్యూనిటీ పెద్దలు తెలిపారు. ఉన్నత చదువులు చదివే ఆడపిల్లలకు ప్రయాణ ఖర్చులు ఉమ్మడిగా భరించనున్నామని తెలిపారు. అలాగే నిశ్చితార్థానికి కేవలం 11 మంది మాత్రమే హాజరవ్వాలని.. వివాహానికి డీజే సిస్టమ్ ఉపయోగించొద్దని నిర్ణయించామని పేర్కొన్నారు. మరి.. అమ్మాయిలు ఫోన్లు వాడకుండా కమ్యూనిటీ పెద్దలు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.