సీఎం అంటే మాములుగా మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్యాంప్ ఆఫీసుల చుట్టు తిరుగుతూ ప్రతీక్షణం బిజీగా ఉంటారు. కానీ ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బస్సు ఎక్కి ప్రయాణించాడు అంటే ఎలా ఉంటుంది. నమ్మటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అవును.. సంచనల నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా పరిపాలనలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. తాజాగా ఆయన బస్సులో ప్రయాణించాడు.
చెన్నైలోని టీ నగర్ నుంచి కన్నిగినగర్ వరకూ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? బస్సులు ఛార్జీలు ఎలా ఉన్నాయి అంటూ బస్సుల్లో ఉన్నటువంటి సమస్యలపై ప్రత్యక్షంగా స్టాలిన్ ప్రయాణికులతో అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సామన్య ప్రజలు ప్రయాణించే బస్సుల్లో ఎక్కి ప్రయాణించటం చూసి బస్సులోని ప్రయాణికులంతా ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక సీఎం స్టాలిన్ బస్సులో ప్రయాణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Watch | Tamil Nadu CM @mkstalin boards a bus in #Chennai, interacts with passengers pic.twitter.com/utt3GdyUlW
— The Indian Express (@IndianExpress) October 23, 2021