దేశంలో కరోనా కేసులు నానాటికి మళ్లీ పెరిగిపోతు ప్రజలను భయందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కోవిడ్ పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ ఏది చేసినా సంచలనమనే చెప్పాలి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా స్టాలిన్ తగు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే మంగళవారం చెన్నై రోడ్డుపై వెళ్తున్న సీఎం సడెన్ గా కారు ఆపి మాస్కులు లేకుండా వెళ్తున్న వారికి మాస్కులు పంపిణి చేశారు.
ఇక ఇదే కాకుండా స్వయంగా కారు దిగి ఓ వ్యక్తికి మాస్క్ సైతం పెట్టారు. ఇదే దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇక స్వయంగా కారు దిగి ప్రజలకు మాస్కులు పంపిణి చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
தலைமைச் செயலகத்திலிருந்து முகாம் அலுவலகம் திரும்புகையில், சிலர் பொது இடங்களில் முகக்கவசம் அணியாமல் இருப்பதை கவனித்தேன். அவர்களுக்கு முகக்கவசம் வழங்கினேன்.
அனைவரும் தயவுசெய்து முகக்கவசம் அணியுங்கள்!
தடுப்பூசி- முகக்கவசம்- கிருமிநாசினி- தனிமனித இடைவெளி ஆகியவற்றை கடைப்பிடிப்பீர்! pic.twitter.com/Xex4Nk9jh5
— M.K.Stalin (@mkstalin) January 4, 2022