మనం జీవించడానికి ఏదో ఒక పని చేయాలి. అది మంచి సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, కూలి పని అయినా సరే అది పూట గడవడానికే. అయితే ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారు కొందరైతే, వాటిని అధిగమించే ప్రయత్నంలో మరికొందరు పట్టువదలకుండా శ్రమిస్తారు. చివరకు సాధిస్తారు. అలాంటిదే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కథ. అతని సమస్యలేంటి? అసలు వివరాలు తెలుసుకుందాం.
‘కోటి విద్యలు కూటి కొరకే’ అన్న చందంగా ప్రతి మనిషి సమాజంలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తారు. కొందరు ఏసీ గదుల్లో జాబ్ చేసి లక్షల కొద్ది జీతాలు సంపాదించినా.. కొందరు చిన్న ఉద్యోగాలు చేసినా.. చేసే పనులు వేరైనాగాని మనం బతుకు సాగించడానికే. అయితే కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ నలిగిపోయేవారు కొందరైతే, ఆ సమస్యలను అధిగమించే మార్గాలను అన్వేషిస్తూ తెగించేవారు కొందరు ఉంటారు. సమస్యలను అధిగమించే ప్రయత్నంలో ఏదో ఓ చోట మంచి అవకాశం కలిసొచ్చి విజయాలకు చేరువ అవుతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా శ్రమించే తత్వం ఉన్నవారికి విజయం చేకూరుతుంది. అలాంటి కోవకు చెందిన వాడే సాహిల్ సింగ్. అతను పడ్డ కష్టాలేంటి? ఎలా గట్టెక్కాడు? అన్న విషయాలను తెలుసుకుందాం..
సాహిల్ సింగ్ జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన యువకుడు. అతని వయసు 30 సంవత్సరాలు. మేవార్ యూనివర్సిటీ నుంచి 2018లో బిటెక్ పూర్తి చేశాడు. తర్వాత నింజాకార్ట్లో, బైజూస్లో కూడా పనిచేశాడు. అయితే కరోనా సమయంలో తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. కాగా కరోనా తగ్గిన తర్వాత స్విగ్గీ డెలివరీబాయ్గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ టెక్ కంపెనీలా మార్కెటింగ్ మేనేజర్గా జాబ్ చేస్తున్న ప్రియాన్సీ చాందెల్ అనే లేడీ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసింది. సాహిల్కి బైక్ లేదు, ట్రన్స్పోర్టేషన్ కూడా ఇవ్వలేదు. కష్టపడి 3 కిలోమీటర్లు కాలినడకతో వెళ్లి ఫుడ్ ఆర్డర్ డెలివరీ ఇచ్చాడు. ఫుడ్ డెలివరీ ఇచ్చిన తర్వాత అలసిపోయిన సాహిల్ మెట్లపై కూర్చున్నాడు. ప్రియాన్సీ ఏమైందని అడుగగా.. జరిగిన విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని ఉన్న డబ్బు తన స్నేహితునికి ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఒక ఆర్డర్ చేస్తే తనకు రూ. 20-25 మాత్రమే వస్తాయని, అదికూడా కస్టమర్ చెప్పిన సమయంలోపు డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. వచ్చే డబ్బులు తన ఖర్చులకు పోగా, సరిగ్గా తినడానికి కూడా సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల వయసు అయిపోవడంతో వారిపై ఆధారపడడం కరెక్ట్ కాదని, కొన్నిసార్లు తిండి లేక టీ, వాటర్తోనే గడుపుతున్నానని తన ఆర్థిక పరిస్థితుల గురించి వివరించాడు. కనీసం నెలకు రూ. 25 వేలు సంపాదించే జాబ్ ఏదైనా ఉంటే చూడమని రిక్వెస్ట్ చేశాడు.
ఇదంతా విని ప్రియాన్సీ చాందెల్ స్విగ్గీ బాయ్ చెప్పిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అడ్రస్.. అన్ని వివరాలతో ఏదైనా జాబ్ వేకెన్సీ ఉంటే చెప్పమని రిక్వెస్ట్ పెట్టింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన చాలామంది డబ్బులు సాయం చేశారు. మరికొందరు ఫుడ్ ఆర్డర్ చేశారు. చివరకు ఒక ఉద్యోగం ఉందన్న విషయం తెలిసి జాబ్లో జాయిన్ అయ్యాడు. ప్రియాన్సీ వల్ల సాహిల్కి జాబ్ వచ్చింది. ప్రియాన్సీ చేసిన పోస్ట్ ఇప్పుడు నట్టింట వైరల్ అవుతోంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.