శంకరలింగం నంబి నారాయణన్ ఇస్త్రో లో మూడు దశాబ్ధాలకు పైగా తన సేవలు అందించారు. 2019 లో భారత అత్యున్నత పురస్కారం పద్మభూషన్ అందుకున్నారు. 1994 ఇస్త్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న నంబి నారాయణన్ క్రయోజనిక్ ఇంజన్లు తయారీకి సంబంధించిన కీలక సమాచారం విదేశీయులకు అప్పగించారని కేరళా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నంబి నారాయణన్ ని కావాలనే ఈ కేసులో ఇరికించారని.. ఈ కేసులో ఆయన ప్రమేయం లేదని.. ఇది తప్పుడు కేసని ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చింది న్యాయస్థానం.
విదేశీయులతో కలిసి కేరళా పోలీసులు నంబి నారాయణన్ ని కావాలనే గూఢాచర్యం కేసులో ఇరికించి ఆయన కెరీర్ నాశనం చేశారని.. మానసికంగా, శారీరకంగా ఆయన్ని బాదించిన పోలీస్ అధికారులు మాజీ డీజీపీ ఆర్.బి.శ్రీకుమార్, రిటైర్డ్ అధికారి పి.ఎస్.జయ్ ప్రకాశ్ తో పాటు మరో ఇద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేరళా హైకోర్టు ఈ నలుగురు అధికారులకు ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.
నంబి నారాయణన్ కేసు లో ఇరికించడం వల్ల క్రయోజనిక్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. రోదసీ కార్యక్రమాలకు రెండు దశాబ్ధాల పాటు అంతరాయం ఏర్పడిందని.. దీని వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లిందని సీబీఐ వాదించింది. అంతేకాదు నిందితులకు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.
ఈ కేసుపై విచారించిన ధర్మాసనం ‘సీబీఐ చేసిన అప్పీళ్లను అంగీకరిస్తున్నాం.. ఈ కేసులో నలుగురు నిందితులకు కేరళా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ తీర్పును కొట్టివేస్తున్నామని.. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటీషన్లను కేరళా హైకోర్టుకే పంపిస్తున్నామని.. మరోసారి నింధితుల బెయిల్ పీటీషన్ ని మొదటి నుంచి పూర్తిగా విచారించి.. నాలుగు వారాల్లో తీర్పు వెలువరించాలని’ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముందస్తు బెయిల్ దరఖాస్తులపై కోర్టు తీర్పు వచ్చే వరకు నిందితులను అరెస్ట్ చేయవొద్దని సీబీఐకి సూచించింది.
Supreme Court set aside Kerala High Court order granting bail to four accused, including a former Director General of Police (DGP), in alleged frame-up of scientist #NambiNarayanan in 1994 #ISROEspionageCase .
— All India Radio News (@airnewsalerts) December 2, 2022