ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 288 మంది చనిపోగా వందల మంది తీవ్ర గాయాలపాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం యావత్ భారత దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 288 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. 1000 మంది వరకు గాయాలపాలయ్యారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయని అనుకునే లోపు ఒడిశాలో మరో ప్రమాదం షాక్ కి గురి చేసింది. సికింద్రాబాద్ – అగర్తల ఎక్స్ ప్రెస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలో సికింద్రాబాద్ – అగర్తల ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బి5 బోగిలో ఒక్కసారే మంటలు రావడం.. దట్టంగా పొగ అలుముకుంది. ఇది గమనించిన ప్రయాణికులు భయంతో ట్రైన్ దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడి చేరుకొని మంటలు చెలరేగిన బోగీని రైల్వే సిబ్బంది పరిశీలించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అసలు బోగీలో పొగలు ఎలా అలుముకున్నాయో అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. వందలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రమాదం జరిగిన స్థలానికి అధికారులు వెళ్లి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు చేపట్టిన దర్యాప్తు కి సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ ప్రమాదం ఉద్దేశ పూర్వకంగానే.. కూట్ర నేపథ్యంలో సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు చేశారన్న ఆరోపణలు వినిపించడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ ని రంగంలోకి దించింది.