నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ట్రాక్టర్ ట్రక్కు నదిలో పడి 15 మంది మరణించారు. తాజాగా మరో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర అంగవైకల్యం ఏర్పడి.. జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. ఇటీవలే మహారాష్ట్రలో ట్రాక్టర్ ట్రక్కు నదిలో పడి 15 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఏప్రిల్ 21వ తేదీ అర్థరాత్రి లక్నో, గోరఖ్పూర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్దింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా మరో 40 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. ఓ ప్రైవేటు బస్సు లక్నో, గోరఖ్ ఫూర్ జాతీయ రహదారిపై అంబేద్కర్ నగర్ వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ.. ఈ బస్సును ఢీకొట్టిందని ఆయోధ్య చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజరు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రక్కు.. పడటంతో బస్సు నుజ్జునుజ్జయిందన్నారు.
ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఇద్దరు మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 మంది మరణించారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జవ్వడంతో గాయపడినవారిని అందులో నుంచి బయటకు తీయడానికి సహాయక సిబ్బందికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు సీఎంఓ ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.