ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ఐటీ కంపెనీలు మాత్రమే ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇవ్వగా, ఇప్పుడు అన్ని రంగాల కంపెనీలు అదే దారిలో నడుస్తున్నాయి. తాజాగా, దేశంలో నిషేధం ఎదుర్కొంటున్న సోషల్ మీడియా యాప్ ఒకటి భారత ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది.
ప్రముఖ చైనా సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’పై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్టాక్, షేరిట్ సహా 59 యాప్లపై కేంద్రం నిషేధం విధిస్తూ జూన్ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల తెలెత్తిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనాటి నుంచి టిక్టాక్ సేవలు దేశంలో పూర్తిగా ఆగిపోయాయి. అయినప్పటికీ సదరు సంస్థ భారత్ లోని తమ కార్యాలయాల్లో సిబ్బందిని కొనసాగిస్తూ వస్తోంది. తాజాగా, వారందరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది.
దేశంలో మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. భారత్లో టిక్టాక్ నిషేధానికి గురైన మూడేండ్ల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కెట్ల కోసం పనిచేస్తున్నారు. తిరిగి భారత్లో కార్యకలాపాలు సాగించేందుకు టిక్టాక్ ప్రయత్నాలు ఫలించకపోపోవడంతో తమ కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా, భారత్, చైనా సైనికుల మధ్య 2020 జూన్లో గల్వాన్ లోయలో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
TikTok lays off all 40 employees in India
_#tiktok #tiktoklayoffs ##tiktok #tiktokindia #tiktokmemes #tiktokfunny #tiktokofficial #tiktokstar #Tiktokindia #recession #finance #business #impeached #financialfreedom #recession https://t.co/dkSA5AQdeS pic.twitter.com/hPQi1CnpCz— Branding Brains (@Brandingbrains) February 10, 2023