మనకు సంబంధించిన డబ్బులు, బంగారు వస్తువులు కనిపించకుండా పోతే ఆ బాధ వర్ణణాతీతం. అయితే పోయిందనుకున్న పది రూపాయలైనా.. మళ్లీ దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటింది ఎక్కడో చెత్తలో పడేసిన బంగారం తిరిగి దొరికితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఓ మహిళకు తన బంగారు నగలు పోగొట్టుకుంది.. ఆ నగలు ఉన్న ప్రదేశాన్ని ఓ చిట్టి ఎలుక చూపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్ర లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ముంబయిలోని దిండోశీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరే కాలనీకి చెందిన సుందరి అనే మహిళ.. తన కూతురు వివాహం కోసం తన వద్ద ఉన్న 100 గ్రాముల బంగారు ఆభరణాలు తనఖా పెట్టి డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు బయలుదేరింది. అదే సమయంలో ఓ యాచకురాలు తన కొడుకుతో వచ్చి ఆకలి అంటూ అడిగింది. ఓ కవర్లో ఉన్న వడాపావ్ను ఆ బాలుడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది సుందరి.
ముంబాయిలో ఓ మహిళ తన కూతురు వివాహం కోసం తన వద్ద ఉన్న వంద గ్రాముల బంగారు ఆభరణాలు తనఖా పెట్టి డబ్బులు తీసుకునేందుకు బ్యాంక్ కి బయలుదేరింది. అదే సమయంలో ఆమెకు ఓ యాచకురాలు ఎదుర పడి తన కొడుకుకి బాగా ఆకలిగా ఉందని ఏమైనా ఉంటే ఇస్తారా అని అడిగింది. ఆమె పరిస్థితి చూసిన జాలి పడ్డ ఆ మహిళ తన వద్ద కవర్ లో ఉన్న వడపావ్ ఇచ్చి అక్కడ నుంచి బ్యాంక్ కి వెళ్లిపోయింది. తీరా బ్యాంక్ కి వెళ్లి చూసిన తర్వాత షాక్ తిన్నది. తాను యాచకురాలికి ఇచ్చిన కవర్ లో బంగారు నగలు ఉన్నాయని.. వెంటనే తిరిగి ఇంటికి బయలు దేరి మొత్తం కలియజూసింది. కానీ యాచకురాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల్లో యాచకురాలు తిరిగిన ప్రదేశాలన్నీ చూశారు. మొత్తానికి ఆమె ఆచూకీ లభించింది. తాను వడాపావ్ ఎండిపోయిందని భావించి అక్కడే ఉన్న చెత్తకుప్పలో పడవేశానని చెప్పింది. దీంతో పోలీసులు ఆ చెత్త కుప్పలో వెతికారు.. కానీ బంగారు నగలు దాచిన కవర్ దొరకలేదు. అక్కడ సీసీ కెమెరాలను మరోసారి పరిశీలించారు. సదరు మహిళ బంగారు నగలు ఉన్న కవర్ ని ఓ ఎలుక తీసుకొని మురికి కాలువలో పడవేసినట్లు గుర్తించారు. కాలువ లో నుంచి ఆ కవర్ ని రికవరీ చేశారు పోలీసులు. మొత్తానికి పోయిందనుకున్న బంగారం తిరిగి దొరకడంతో ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.