సాధారణంగా నేరం చేసిన నేరస్థులకు జైలు శిక్ష విధించడం సహజమే. అయితే ఈ జైలు శిక్షకాలంలో కోందరు నేరస్థులు మానసికంగా, శారీరకంగా కుంగిపోతుంటారు. దానికి కారణం వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటమే. ఈ క్రమంలోనే ఖైదీలలో మానసిక, శారీరక ఒత్తిడిని దూరం చేయడానికి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖైదీలలో మానసిక పరివర్తన కోసం వారి వారి భార్య లతో ఏకాంతంగా గడిపేందుకు కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే జైలు ఆవరణంలోనే ఓ గదిని సిద్దంచేసి.. అందులో డబుల్ బెడ్ ను సైతం అందుబాటులో ఉంచింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పంజాబ్ గవర్నమెంట్ జైల్లో ఉన్న ఖైదీలకు గడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు కుటుంబానికి దూరంగా ఉంటూ.. మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురవుతున్న వారికి ఊరట కలిగించే పథకాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే? జైలు శిక్ష అనుభవిస్తోన్న ఖైదీ తన భార్యతో కలిసి ఏకాంతంగా రెండు గంటల పాటు గడపోచ్చు. దీనికోసం జైలు అధికారులు ఓ గదిని, దాంట్లో డబుల్ బెడ్ మంచాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదీ కాక భాగస్వామితో శారీరకంగా కవలవడానికి వీలుగా కండోమ్ లను కూడా అందుబాటు ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ పథకం తేక ముందు ములాఖత్ కు వచ్చే వారిని ఖైదీలతో డైరెక్ట్ గా మాట్లాడించేవారు కాదు. వారు ఎదురెదురుగా ఉన్నాగానీ వారి మధ్యలో ఇనుప జాలీ లాంటిది అడ్డుగా ఉండేది. ఇక వారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోన్ లోనే మాట్లాడుకునే వారు.
ఈ క్రమంలోనే ఈ పథకాన్ని అమలు చేసిన వారంలోనే 385 అభ్యర్థనలు వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఖైదీల అభ్యర్థనలను అనుమతించడం, అనుమతించకపోవడం లాంటి అధికారం జైలు సూపరిడెంట్ కే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పై పంజాబ్ స్పెషల్ ఆఫీసర్ DGP(జైల్స్) హర్ ప్రీత్ సిద్దూ మాట్లాడుతూ..”ఖైదీలను మానసికంగా, శారీరకంగా శిక్షించే అధికారం మాకు లేదు. అదీ కాక జైలులో లేని భాగస్వామిని శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురిచేసి శిక్షడం భావ్యం కాదనే ఉద్దేశంతోనే మేం ఈ ప్రాజెక్ట్ ను దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నాం. సెప్టెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా 3 జైల్లలో అమలు చేయగా.. ప్రస్తుతానికి 17 జైల్లకు ఈ పైలట్ ప్రాజెక్ట్ ను విస్తరించాం” అని సిద్దూ తెలిపారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే? ప్రతీ ఒక్క ఖైదీ ఈ పథకానికి అప్లై చేసుకునే వీలు లేదు. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చట్టబద్దంగా వివాహం చేసుకున్న వారే దీనికి అప్లై చేసుకునే వీలుంది. పిల్లలపై లైంగిక నేరాలు, తీవ్రవాదులు, దోంగతనాలు, దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారు, జైలు లో గొడవలు పడ్డ వారు ఈ పథకానికి అనర్హులుగా అధికారులు పేర్కొన్నారు. ఈ వెసులుబాటు తీసుకురావడం పట్ల పలువురు ఖైదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా మానసికంగా కుంగిపోతున్నా మాకు ఇది చాలా ఊరటని కలింగించిందని వారు తెలిపారు. అయితే పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఖైదీలకు ఈ పథకం వర్తించదని అధికారులు స్ఫష్టం చేశారు.