మనిషికి పట్టుదల, తపన, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. సంకల్పం బలంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యగా ఎదుర్కొని విజయం సాధించ వచ్చు. అలా జీవితంలో అనేక కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నత శిఖరాలకు అనేక మంది అధిరోహించారు. అలాంటి వారిలో ఒకరు ప్రతీక్ష టోండ్ వాల్కర్. 16 ఏళ్ల వయస్సులో పెళ్లి..ఒక కుమారుడు జన్మించాడు. 20 ఏళ్ల వయస్సులోనే వితంతువుగా మారింది. ఇక అప్పటి నుంచి ఆమె అనేక కష్టాలు అనుభవించారు. స్వీపర్ నుంచి మొదలు పెట్టిన ఆమె.. దేశంలో బ్యాంకింగ్ రంగంలో పెద్దదైన ఎస్బీఐలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా రిటైర్డు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే…
మహారాష్ట్రలోని పూణేలో ఓ నిరుపేద కుటుంబంలో 1964లో ప్రతీక్ష టోండ్ వాల్కర్ జన్మించారు. ఆర్ధిక సమస్యల కారణంగా ప్రతీక్షకు 16 ఏళ్ల వయస్సులోనే సదాశివ్ కడుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. సదాశివ్..ముంబైలోని SBIలో బుక్ బైండర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి పెళ్లయిన ఒక సంవత్సరం తర్వాత కుమారుడు జన్మించాడు.ఓ రోజు తమ పూర్వీకుల గ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సదాశివ్ మరణించాడు. దీంతో 20 ఏళ్లకే ప్రతీక్ష వితంతువుగా మారి.. కొడుకును పోషించవలసి వచ్చింది.
ఆ సమయంలో, తన భర్త కు రావల్సిన బకాయిలను వసూలు చేయడానికి SBI బ్రాంచ్కి వెళ్లింది. అదే సమయంలో తన బిడ్డను పోషించుకోవడానికి ఉద్యోగం చేయాలని అనుకుంది. కానీ ఆమెకు ఎలాంటి విద్యాఅర్హత లేదు. దీంతో తనకు సాయం చేయాలని బ్యాంకును కోరింది. దీంతో అక్కడ స్వీపర్ గా పనిచేయడం ప్రారంభించింది. ఆవరణలో ఊడ్చడం, బాత్రూమ్లు శుభ్రం చేయడం, ఫర్నీచర్ దుమ్ము దులపడం చేసేది. ఆమెకు నెలకు రూ. 60-65 ఇచ్చేవారు. వీటితో పాటు.. ఆమె ఇతర చిన్నాచితకా ఉద్యోగాలు చేసి, మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చే వరకు తన కొడుకును చూసుకునేది. ఈక్రమంలో సమాజంలోనే కొందరి ఉన్నత స్థాయిలో ఉన్న వారి ప్రభావం ఆమెపై పడింది. సమాజంలో అందరు మంచిగా ఉంటున్నారు. తానేందుకు ఉండకూడదను కుంది.
వెంటనే.. తను కూడా ఏదైన ఉద్యోగం చేయాలను కుంది. ఈ క్రమంలోనే పనిచేస్తూ 10 క్లాస్ పరీక్షలు రాసి పాసైంది. బ్యాంక్ లో ఉద్యోగం సాధించాలంటే.. ఇంటర్ పాస్ అవ్వాలని తెలుసుకుంది. ఈ క్రమంలో.. ముంబైలోని విక్రోలిలోని ఒక నైట్ కాలేజీలో చేర్చుకుంది. అక్కడ 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఈక్రమంలో బ్యాంక్ స్వీపర్ నుంచి ఆమెకు క్లర్క్గా పదోన్నతి కల్పించింది. ప్రతీక్ష.. తనను బ్యాంకింగ్ పరీక్ష రాయమని ప్రోత్సహించిన బ్యాంక్ మెసెంజర్ ప్రమోద్ టోండ్వాల్కర్ను 1993లో వివాహం చేసుకుంది. అతను ఇంటి పనుల్లోను, పిల్లలను చూసుకొవడంతో కూడా ఆమెను సహాయం చేస్తుండేవాడు.
ఈ క్రమంలో.. ఆమె 2004లో ట్రైనీ ఆఫీసర్గా ఎదిగి ఎదిగింది. జూన్లో SBI అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాకు చేరింది. ఆమె SBIలో 39 ఏళ్ల కెరీర్లో దాదాపు రెండు సంవత్సరాలలో పదవీ విరమణ చేయనున్నారు. కానీ పదవీ విరమణ తర్వాత ప్రకృతివైద్యంలో కెరీర్ని ప్రారంభిస్తానని తెలిపింది. ప్రతి చిన్న సమస్యకు భయపడి, బాధపడే వారికి.. ప్రతీక్ష టోండోవాల్క్ స్ఫూర్తిదాయకం. మరి.. స్వీపర్ నుంచి ఏజీఎంగా ఎదిగిన ఈమెపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Widowed at just 20 years of age, Pratiksha Tondwalkar of #Pune got job as Sweeper in #SBI Bank
She continued her studies while working & got elevated as clerk,Trainee Oficer, then as MMII, MM III , Scale IV, CGM & is now AGM
Sweeper to AGM. #inspiring#RealHero #BharatKeVeer pic.twitter.com/SeaNJTqtk7— Srikanth Matrubai (@SrikantMatrubai) July 1, 2022