మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలో ఉన్న ‘సమృద్ధి ఎక్స్ప్రెస్ హై వే’పై ప్రమాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 17 మంది కూలీలు ప్రాణాలుపోయాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
నిత్యం మనం ఎన్నో అనుకోని సంఘటనలు చూస్తున్నాం. రోడ్డుపై వెళుతున్నపుడు యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోతుంటారు. ఒక్కోసారి నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కుప్పకూలి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ పని చేసే కూలీలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటుంటారు. పొట్టచేత పట్టుకుని కూలిపనుల కోసం వచ్చి తమ కుటుంబాలకు దూరంగా నివసిస్తూ తిరిగిరాని లోకాలకు వెళుతుంటారు. కారణాలు ఏవైనా బలిఅవుతున్నది మాత్రం కూలీల ప్రాణాలే. తాజాగా మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలో ఉన్న ‘సమృద్ధి ఎక్స్ప్రెస్ హై వే’పై ప్రమాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 17 మంది కూలీలు ప్రాణాలుపోయాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మహారాష్ట్ర థానేలో నిర్మాణ దశలో ఉన్న ‘సమృద్ధి ఎక్స్ప్రెస్ హై వే’పై ఘోర ప్రమాదం జరిగింది. థానే జిల్లాలోని షాపూర్ తహసీల్ దగ్గర వంతెన నిర్మాణం కోసం గిర్డర్లను ఎత్తి అందిస్తున్న క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో 17 మంది కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
దాదాపు 200 అడుగుల ఎత్తులో ఉండగా క్రేన్ కూలిపోయిందని అధికారులు గుర్తించారు. అయితే క్రేన్ కూలిపోయిన కారణాలు తెలయరాలేదు. మృతి చెందిన కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ సమృద్ధి మహామార్గ్ను నాగ్పూర్- ముంబై మధ్య 701 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన రెండు దశల పనులు ఇదివరకే పూర్తి అయ్యాయి. మూడో దశ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం నెలకొంది.
17 KILLED IN CRANE COLLAPSE NEAR #MUMBAI
17 labourers killed, 4 injured in crane accident on under-construction expressway in #Maharashtra‘s Thane, Rescue operations underway. @shwetaa_verma reports pic.twitter.com/MnS5vNnRke
— Mirror Now (@MirrorNow) August 1, 2023