ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు. దీని వలన సెక్యూరిటీ కూడా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. పేదలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కష్టంగా ఉంటుంది. అయితే ప్రీమియం కేవలం ఒక్క రూపాయి నెలకి అంటే ఎలా ఉంటుంది? పేదలు కూడా ఖచ్చితంగా ఈ ప్రీమియంని చెల్లించగలుగుతారు. ఆ స్కీమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన.
మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన-PMSBY పేరుతో 2015లో ప్రారంభించిన సామాజిక సురక్ష పథకాన్ని ప్రారంభించింది. కనీస ప్రీమియం రేటు ఏడాదికి 12 రూపాయలుగా ఉండే ఈ పాలసీ పేదవాళ్ళకి, తక్కువ ఆదాయం వచ్చే వర్గాలకి ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అకాల మరణానికి, శాశ్వత అవిటితనానికి 2లక్షల రూపాయల జీవితబీమాను, శాశ్వత పాక్షిక్ష అవిటితనానికి 1 లక్ష రూపాయల బీమాను అందిస్తుంది.
పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ప్రీమియం మొత్తం సంవత్సరంలో ఒకసారి చెల్లించాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా కట్ అయిపోతుంది. సమీపంలో ఉండే బ్యాంకుకు వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ ని కన్సల్ట్ చేసి అయినా సరే సులభంగా అప్లై చేసుకోవడానికి వీలు అవుతుంది.