అమ్మాయి అని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటారు చాలా మంది. మరికొంత మంది భారంగా భావించి చెత్తకుప్పలో పడేస్తుంటారు. ఆడపిల్ల ఇంట్లో పనులకు పనికొస్తుందిలే అని అనుకునేవారి గురించి ఇంక చెప్పనక్కర్లేదు. ఆడపిల్ల విషయంలో ఓ కుటుంబం అందరికి ఆదర్శం. ఆడపిల్ల పుట్టిందని.. ఏకంగా చంద్రమండలంపైనే ఆమె పేరు మీద భూమి కొన్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు? అక్కడే ఎందుకు భూమి కొన్నారు?
బీహార్కు చెందిన ఓ కుటుంబలో ఏడు తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు. గజ్జల సవ్వడిలేదు, గాజుల చప్పుడు లేదు, అందంగా రెడీ చేయాలి అన్నా అవకాశం లేదు. అందుకే పుట్టిన అబ్బాయిలకు లంగా జాకెట్టు వేసి ఫొటోలు తీయించి సరదా తీర్చుకునే వారు. కానీ ఎంత చేసినా.. ఇంట్లో ఆడపిల్ల పుట్టలేదు అనే లోటు వారిలో కనిపించేది. దీంతో ఆ కుటుంబానికి చెందిన సుర్విందర్, సుధా అనే దంపతులు పాప పుట్టాలని ఎన్నో పూజలు చేశారు. దేవుడు కూడా కరుణించి ఆడబిడ్డను ప్రసాదించాడు.ఆ పాపకు ఆస్తా భరద్వాజ్గా నామకరణం చేశారు. ఏడు తరాల తర్వాత పుట్టిన పాప కావడంతో ఆమె కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నారు. జీవితాంతం గుర్తుడిపోయేలా ఉండాలి అని అనుకున్నారు.
చంద్రమండలంపై భూమి కొని రిజిస్టర్ చేసి ఆ పాపకు బహుమతిగా ఇచ్చారు. అందుకోసం అమెరికాలోని కాలిఫోర్నియా లూనర్ సొసైటీ వెబ్సైట్కి అన్ని వివరాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించారు. అక్కడ ఉన్న భూమి విలువ ఎంత ఉంది అనేది పూర్తిగా తెలుసుకుని పేపాల్ యాప్ ద్వారా డబ్బులు కట్టి.. కూతురు ఆస్తా భరద్వాజ్ పేరు మీద అక్కడి స్థలాన్ని రిజిస్టర్ చేశాడు. ఏం అనుకున్నా.. తమ పాప కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం అని చెబుతున్నారు. కాగా.. చందమామపైనే ఆమె పేరుపై స్థలం కొనడం సంతోషంగా ఉందని.. జీవితాంతం ఆమెకు ఈ గిఫ్ట్ గుర్తుంటుందని చెబుతున్నారు. మరి ఈ తల్లిదండ్రులు.. చిన్నదానికి ఇచ్చిన గిఫ్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.