దేశంలో ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా తమ సత్తా చాటుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు మాత్రమే కాదు ప్రతి వృత్తి, రాజకీయాల్లో మహిళలు తమదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు.
నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీపడుతూ ముందుకు సాగుతున్నారు. మహిళలను అన్ని రంగాల్లో సమానత్వాన్ని తీసుకు రావడానికి భారత దేశం ఎంతో కృషి చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు మాత్రమే కాదు ప్రతి వృత్తిలోనూ ఒక ప్రమాణాన్ని సాధించగలిగారు మహిళలు. ఇక రాజకీయాల్లో కూడా తమదైన సత్తా చాటుతున్నారు భారతీయ మహిళలు. ఈ క్రమంలో 60 ఏళ్ల తర్వాత ఓ మహిళ తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది.. ఆ మహిళ ఎవరు? అది ఏ రాష్ట్రం? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ పార్టీ స్పష్టమైన ఆదిక్యత సంపాదించగా మేఘాలయలో మాత్రం సంగ్మా పార్టీ సత్తాచాటింది. ఈసారి మేఘాలయలో ఓ మహిళ సరికొత్త చరిత్ర సృష్టించింది. 60 ఏళ్ల తర్వాత నాగాలాండ్ లో తొలిసారిగా ఓ మహిళ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థిని అయిన హెకానీ జఖాలు విజయం సాధించారు. ఆమె నాగాలాండ్ లోని దిమాపూర్- 3 నియోజకవర్గం నుంచి పోటీచేశారు. ఎల్ జేపీ కి చెందిన అజెటో జిమోమిని పై 1500 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
హెకానీ జఖాలు వృత్తి రీత్యా న్యాయవాది. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వేతర సంస్థ ‘యూత్ నెట్ నాగాలాండ్’ నడుపుతున్నారు. తద్వారా ఎంతో మంది యువత చదువుకునేందుకు ఆమె అండగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడ మంచి ప్రజాదరణ ఉంది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 183 మందిలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీలో మహిళలకు ప్రాతినిధ్యం లేదు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ గెలుపొందడం ఇదే తొలిసారి. 60 ఏళ్ల తర్వాత నాగాలాండ్ లో తొలిసారిగా హెకానీ జఖా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది.
#ResultsWithNDTV | Hekani Jakhalu from BJP’s ally NDPP becomes Nagaland’s first woman MLA https://t.co/4EgjnHB9Pe pic.twitter.com/iSFU6klI7G
— NDTV (@ndtv) March 2, 2023