గత కొంత కాలంగా సినీ, రాజకీయ వర్గాల్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధన గుప్తా కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు.
ములాయం సింగ్ యాదవ్ ఆమె చనిపోయే సమయానికి పక్కనే ఉన్నారు. గతంలో ములాయం సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సాధన ఆయనకు రెండో భార్య. మొదటి భార్య మాలతీ దేవి చనిపోయిన తర్వాత సాధనని వివాహం చేసుకున్నారు.
ఆమె తనయుడు ప్రతీక్ యాదవ్ వ్యాపార రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రతీక్ సతీమణి అపర్ణా యాదవ్ బీజేపీ లో ఉన్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ములాయం మొదటి భార్య కుమారుడు. సాధన గుప్తా మృతిపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాధ్ మౌర్య సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
पूर्व मुख्यमंत्री श्री मुलायम सिंह यादव जी की पत्नी श्रीमती साधना गुप्ता जी के निधन का दुखद समाचार मिला,प्रभू पुण्यात्मा को अपने श्री चरणों में जगह दे. आदरणीय श्री मुलायम सिंह जी और परिजनों को ये दुख सहन करने की क्षमता दे!
ॐ शांति शांति शांति— Keshav Prasad Maurya (@kpmaurya1) July 9, 2022
ఇది చదవండి: Karimnagar: పెళ్ళైన 15 ఏళ్లకు పుట్టిన బిడ్డని కారు బలితీసుకుంది!