సాంకేతికంగా, ఆలోచన పరంగా దేశం, మనుషులు ఎదుగుతున్న ఈ కాలంలో కూడా ఇంకా ఆడపిల్ల, మగ పిల్లవాడు అంటూ వ్యత్యాసం చూపుతున్నారు. కూతురు పుడితే.. పురిటిలోనే చంపేసేందుకు వెనుకాడటం లేదు.ఆరుగురు ఆడ పిల్లలను కన్న ఓ తల్లి.. ఏడో కాన్పులో కూడా ఆడ పిల్లే పుట్టిందని అత్త మందలిస్తుందన్న కారణంగా ఆసుపత్రిలో బిడ్డను వదిలేసింది. కానీ ఆ ఇంట్లో
‘ఇంటికి వారసుడు మగ పిల్లవాడు. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి.. పున్నామ నరకం నుండి తప్పిస్తాడు’ అంటూ అత్తింటివారు.. కోడలిని మగ పిల్లవాడినే కనాలని హుకుం జారీ చేస్తుంటారు. ఇక కూతురు పుడితే.. ఆమెను చూడకపోగా.. పురిటిలోనే చంపేసేందుకు వెనుకాడటం లేదు. కొంత మంది ఆడ పిల్ల కావాలనుకుంటున్న వారికి పుట్టడం లేదని బాధ పడుతున్నారు. సాంకేతికంగా, ఆలోచన పరంగా దేశం, మనుషులు ఎదుగుతున్న ఈ కాలంలో కూడా ఇంకా ఆడపిల్ల, మగ పిల్లవాడు అంటూ వ్యత్యాసం చూపుతున్నారు. తాజాగా మగ పిల్లవాడి కోసం ఆరుగురు ఆడ పిల్లలను కన్న ఓ తల్లి.. ఏడో కాన్పులో కూడా ఆడ పిల్లే పుట్టిందని అత్త మందలిస్తుందన్న కారణంగా ఆసుపత్రిలో బిడ్డను వదిలేసింది. కానీ ఆ ఇంట్లో ఆడ పిల్ల పుట్టిందని అంబరాన్ని తాకే సంబంరాలు చేసిందో ఓ కుటుంబం.
లేక లేక ఆడ పిల్ల పుట్టిందని.. ఏనుగు అంబారీపైనే ఉరేగించారు తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్ గావ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పచ్ గావ్కు చెందిన గిరీశ్ పాటిల్, సుధ దంపతులు. పూణెలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న గిరీశ్. వీరికి ఐదు నెలల క్రితం ఆడ పిల్ల పుట్టింది. ఐతే 35 ఏళ్లు తర్వాత ఆ ఇంట్లో ఆడ పిల్ల పుట్టడం వారింట్లో ఆనందాన్నినింపింది. పాపకు ఐరా అని పేరు పెట్టుకున్నారు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్య, తన కుమార్తెను తొలిసారిగా తన ఇంటికి తీసుకొచ్చేందుకు సిద్దమయ్యాడు గిరిశ్. గుజరాత్లోని హత్తివరోన్ నుంచి పచ్ గావ్కు కుమార్తెకు ఘనంగా స్వాగతం పలకాలనుకున్నాడు. పాపను అమ్మమ్మ ఇంటి నుంచి తీసుకొచ్చిన తండ్రి.. ఏనుగు అంబారీతో ఊరేగించాడు. కుమార్తెను ఊరు పొలిమేరల నుంచి ఏనుగుపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్య ఇంటికి తీసుకువెళ్లాడు. బంధువులు, ఇరుగు పొరుగు వారిని ఈ వేడుకకు ఆహ్వానించాడు. ఆడ పిల్ల పుట్టిందని సంబంరాలు చేస్తూ కొంత మంది మిగిలిన వారికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు.