నేటి సమాజంలో కొంత మంది క్షణికావేశంలో చేసే పనులు.. ఇతరుల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ.. దుర్భాషలాడుతున్న మనిషిని ప్రశ్నించినందుకు, ప్రశ్నించిన ఆ మనిషినే కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసేసిన దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తీవ్ర గాయాలతో పట్టాల పక్కన ఉన్న బాధితుడిని కాపాడిన రైల్వే పోలీసులు.. ఘటనకు కారణం అయిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో సజల్ షేక్ అనే వ్యక్తి తన ఇంటికి వెళ్లడానికి ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దుర్భాషలాడుతూ, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని సజల్ తో ఓ వ్యక్తి ఘర్షణకు దిగాడు. సహనం కోల్పోయిన సజల్ అతడిపై చేయిచేసుకున్నాడు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలోనే ఆ యువకుడిని రైల్లో నుంచి నెట్టేశాడు సజల్. అనంతరం తనకేమీ సంబంధం లేనట్లుగా వచ్చి తన సీట్లో తాను కూర్చున్నాడు. ఈ నేపథ్యంలోనే రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న వారు.. తీవ్ర గాయాలతో పడి ఉన్న బాధితుడిని దగ్గరలోని బిర్భూమ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడి నుంచి వాగ్మూలం సేకరించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడి మాటలప్రకారం..”నలుగురు వ్యక్తులు గట్టిగా అరుస్తూ మాట్లాడుకుంటున్నారు. దాంతో పక్కనే ఉన్న కుటుంబానికి చాలా డిస్టబెన్స్ గా ఉంది. అదీ కాక వారు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేను వారిని ఇలా చేయవద్దని చెప్పడానికి వెళ్లాను. దాంతో నలుగురిలో ఓ వ్యక్తి వచ్చి నాతో ఘర్షణకు దిగాడు. బెదిరించాడు, గొడవలో రైల్లో నుంచి నన్ను కిందికి నూకేశాడు” అంటూ పోలీసులకు వివరించాడు బాధితుడు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. పోలీసులు తెలిపారు.
This is totally Shocking…
from #WestBengal
After an altercation a passenger pushed another out of a moving express train & coolly went back to his seat.#IndianRailwayspic.twitter.com/wO0JuBmddX
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) October 17, 2022