మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు ధనంజయ్ ముండే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ విషయం గురించి తెలుసకున్న మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెంటనే హాస్పిటల్ కి చేరుకొని ధనంజయ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. ధనంజయ్ ముండే కి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. కేవలం స్పృహతప్పడం వల్ల ఆసుపత్రికి తరలించారని అన్నారు. గతంలో ఆయన రెండు సార్లు కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే.