ప్రేమించిన పాపానికి ప్రియుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రియురాళ్లు ఈ దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నారు. ప్రాణాలు పోగొట్టుకోవటమో.. లేదా వారి చేతిలో నిత్యం నరకం చూడటమో జరుగుతోంది. తాజాగా, మధ్య ప్రదేశ్లోని మీర్జాపూర్లో ఓ యువతిని ఆమె ప్రియుడు దారుణంగా కొట్టిన ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అధికారులు ఈ ఘటనపై చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా అతడికి జీవితాంతం గుర్తుండిపోయేలా బుల్డోజర్ టచ్ ఇచ్చారు.
జిల్లా అధికారులు అతడి ఇంటికి బుల్డోజర్ను పంపారు. ఇళ్లు మొత్తాన్ని కూలగొట్టారు. ఇళ్లు మొత్తం కూలిపోయింది అని ధ్రువీకరించుకున్న తర్వాతే అక్కడినుంచి వెళ్లిపోయారు. సదరు నిందితుడు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి డ్రైవింగ్ లెసెన్స్ను కూడా అధికారులు రద్దు చేశారు. నిందితుడిపై సరైన సమయానికి చర్యలు తీసుకోని కారణంగా స్థానిక పోలీసులను సైతం అధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బుల్డోజర్తో నిందితుడి ఇంటిని కూల్చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ చర్యను సమర్థిస్తున్నారు. మరికొందరు దీన్ని దారుణమైన చర్యగా పరిగణిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగింది?
మధ్య ప్రదేశ్, మీర్జాపూర్కు చెందిన పంకజ్ త్రిపాఠి, అదే ప్రాంతానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన ప్రియురాలి దగ్గర పంకజ్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే, ఇందుకు ఆమె అంగీకరించలేదు. ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోకపోయే సరికి పంకజ్ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆమెను కిందపడేసి చావకొట్టాడు. ముఖంపై కాలితో తంతూ దారుణంగా ప్రవర్తించాడు. అతడి దెబ్బలు తాళలేక ఆమె అక్కడికక్కడే స్ప్రహ తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
WATCH | Man Seen In Video Thrashing Teen Gets A Bulldozer Visit In Madhya Pradesh https://t.co/BpY0p9fqQy pic.twitter.com/euzN68bZzH
— NDTV (@ndtv) December 25, 2022