దేశ వ్యాప్తంగా బోరుబావుల్లో చిన్న పిల్లలు పడిపోయి చనిపోతున్న విషయం తెలిసిందే. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి చిన్నారులు బలిఅవుతున్నారు. ఉపయోగం లేని బోరుబావులను పూడ్చివేయాలని యజమానులకు చెప్పినా.. నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
దేశంలో ఎక్కడో అక్కడ చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కోసం బోర్లు వేయిస్తుంటారు.. కొన్నిసార్లు అవి ఫెయిల్ కావంతో వాటిని పూడ్చడం, కప్పి పెట్టడం లాంటివి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలివేస్తుంటారు. మరికొన్ని చోట్ల భూమిలో నీరు అడుగంటిపోవడంతో నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చి వేయకుండా అలాగే వదిలివేస్తుంటారు. పెద్ద చేసే నిర్లక్ష్యం వల్ల చిన్నారులు తెలియకుండా బోరువుల్లో పడిపోతుంటారు. తాజాగా ఓ మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
సాదారణంగా వ్యవసాయ క్షేత్రాల్లో బోరు బావులు వేసి వాటి విషయంలో నిర్లక్ష్యం వహించేవారు ఎంతో మంది ఉన్నారు. దాని ఫలితంగా చిన్నపిల్లలు బోరుబావుల్లో పడి చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. బోరు బావుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటి ఉపయోగం లేని పక్షంలో పూడ్చి వేయాలని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మూడేళ్ల చిన్నారి 300 ఫీట్ల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయి మృత్యువుతో పోరాడుతుంది. మధ్యప్రదేశ్ లో సిహూర్ జిల్లాలో ముగవాళి గ్రామానికి చెందిన మూడేళ్ల శృష్టి కుశ్వహా మంగళవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రెవెన్యూ, ఎన్టీఆర్ఎఫ్, పోలీసులు కలిసి శృష్టి పేరుతో ఆపరేషన్ ని మొదలు పెట్టారు. మొదట 30 అడుగుల లోతులో చిన్నారిని గుర్తించారు. శృష్టిని రక్షించేందుకు గత 17 గంటలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డ్రిల్లింగ్ కారణంగా చిన్నారి మరో 20 అడుగుల లోతులోకి జారిపోయింది. దీంతో ఆపరేషన్ కష్టంగా మారిపోవడంతో తవ్వకాలు నిలిపారు.. ప్రస్తుతం చిన్నారి 50 అడుగుల ఫీట్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాపను రక్షించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని.. సురక్షితంగా బయటకు తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.