ఈ మద్య సామాన్యులు మార్కెట్ కి వెళ్లి ఏదైనా వస్తువు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం తర్వాత సరైన ఉపాధి లేక అల్లాడుతున్న పేద ప్రజల పై ప్రస్తుతం ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
దేశంలో రోజు రోజుకీ నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ పెరిగిపోతూనే ఉన్నాయి. వచ్చే ఆదాయం కొంతైతే.. పెరిగిన ధరలు కొండంత కావడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్, వంటనూనె, గ్యాస్ ధరలు పెరిగిపోతుంటే.. మరోవైపు నిత్యాసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ ధరలు కరోనా ప్రభావం తర్వాత సరైన ఉపాధి లేక అల్లాడుతున్న పేద ప్రజల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇలాంటి సమయంలో సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం. దేశమంతా రూ.1100 మించి ఉన్న గ్యాస్ ధర అర్హులైన ప్రజలకు రూ. 500 లకే ఇస్తోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోందన్న విషయం గురించి తెలుసుకుందాం..
ప్రస్తుం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు చుక్కల్లో ఉన్నాయి.. వాటికి తోడు గ్యాస్ ధర కూడా భారీగా పెరిగిపోయింది. సామాన్యులకు గుదిబండగా మారుతున్న ధరల నుంచి కాస్తంత ఉపశమనం కలిగించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రూ.1100 మించి ఉన్న గ్యాస్ ధర అర్హులైన ప్రజలకు రూ. 500 లకే ఇస్తుంది రాజస్థాన్ ప్రభుత్వం. అయితే ఈ పథకం ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రతి సంవత్సరం రూ.750 అదనపు భారం పడుతున్నప్పటికీ.. ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నిర్ణీత ధరకు మించి ఒక్కరూపాయి కూడా ఎక్కువ తీసుకునే ప్రసక్తి లేదని తెలిపింది.
రూ.500 లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ని పొందాలంటే.. రాజస్థాన్ నివాసి అయి ఉండాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు ఈ పథకాన్ని పొందవొచ్చు. సబ్సిడీ పొందడానికి లబ్ధిదారుడు తన బ్యాంక్ ఖాతాను ఆధార్ తో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా లింక్ చేయని ఎడల సబ్సిడీ ప్రయోజనం పొందలేరు. వినియోగదారులు గ్యాస్ కొనుగోలు చేసే సమయంలో మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. తమ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. ఈ పథకం ద్వారా రాజస్థాన్ లో సుమారు 73 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది.