మిడతల నియంత్రణ బృందం రాజస్తాన్ బార్డర్లో భారీగా మిడతల గుడ్లు ఉన్నట్లు కనుక్కొన్నారు. ఇవి ఆవిర్భావ ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. మిడతలు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతాయని, కోట్ల సంఖ్యలో ఒకేసారి దాడి చేస్తాయని తెలుపుతున్నారు. ఇది ప్రమాదానికి సంకేతం అని భావిస్తున్నారు.
పంటపొలాల్లో చాలా కీటకాలు ఉంటాయి. చేను తడిగా ఉన్నప్పుడు అనేకం వచ్చి చేరి పంటలను ఎదగనీయకుండా చేస్తాయి. వాటి భారిన పడకుండా క్రిమిసంహారక మందులను పిచికారి చేసి రైతులు పంటలను కాపాడుకుంటారు. వీటిలో మిడతలు పంటలను త్వరగా నాశనం చేస్తాయి. ఎందుకంటే పంట పండుతున్న సమయంలో చేనుపై ఆహారం కోసం వచ్చి చేరుతాయి. మిడతలు పంట చేతికందే సమయంలో పొలాల మీద పడ్డాయంటే చాలా బీభత్సం సృష్టిస్తాయి. ఇంతకు ముందు కూడా మన దేశంపై మిడతల దండు అటాక్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అవి గుంపులుగా వచ్చి పంటలను నాశనం చేసే వరకు వదలవు. తాజాగా రాజస్థాన్లో సరిహద్దు ప్రాంతంలో మిడతల గుడ్లు భారీగా కనుగొనబడినవి. రాజస్థాన్లో మిడతల నియంత్రణ బృందం సర్వే ప్రకారం..
రాజస్థాన్ బార్డర్లో మిడతల గుడ్లు ఆవిర్భావ దశ మొదలైందని, ఇది ప్రమాదానికి సంకేతమని తెలిపింది. మిడతలు గుంపులుగా ఎగురుతాయి. కోట్ల సంఖ్యలో మిడతలు ఒకేసారి వచ్చి చేరుతాయని తెలిపారు. ఈ మిడతల దండు పంటలున్న ప్రదేశంలో వాలితే.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంటలు నిమిషాల్లో మాయం అవుతాయని మిడతల నియంత్రణ బృందం తెలిపింది. మిడతల దండు చాలా ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం ఒక చదరపు కిలో మీటరులో విస్తరించి ఉన్న మిడతల గుంపులో దాదాపు నాలుగు కోట్ల మిడతలు ఉంటాయి.
ఇవి పంటలను కాకుండా చెట్లు, మొక్కలను, పువ్వులను, విత్తనాలను, చెట్ల బెరడు కూడా ఆహారంగా తీసుకుంటాయని తెలిపారు. రాజస్థాన్ చేరుకున్న ఈ మిడతలు పాకిస్తాన్ నుండి వచ్చాయని, మన దేశానికి రావడానికి చాలా దూరం ఉందని.. అయినా మన దేశానికి వచ్చాయని చెబుతున్నారు. మిడతల గుంపు చాలా వేగంగా పెరుగుతుందని, వీటి జీవిత కాలం 3 నుండి 5 నెలలు. అయితే జీవితకాలంలో ఆడమిడత మూడుసార్లు గుడ్లు పెడుతుందని, ఒక్కోసారి 70 నుండి 150 వరకు గుడ్లు పెడుతుందని చెబుతున్నారు. వర్షాకాల తర్వాత ఇవి ఎక్కువగా కనబడతాయి. ఇవి గాలిలో ఎగురుతుంటాయి. ఒక గంటకు 13 కి.మీ. వేగంతో ఎగురుతూ ఒక రోజులో 150 నుండి 200 కి.మీ ప్రయాణిస్తుంది. ఇవి పంటపై వాలితే 20 నుండి 25 నిమిషాల్లో ఆ ప్రాంతంలో ఉన్న పంటలు, మొక్కలను నాశనం చేస్తాయిని నిపుణులు తెలిపారు.
ఇప్పటి వరకు మనదేశంలో 2020లో జరిగిన మిడతల దాడి చాలా పెద్దది. అప్పట్లో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో 50 వేల హెక్టార్లకు పైగా పంటలు తినేశాయి. వీటి సమూహాలను ఎదుర్కోవడానికి నియంత్రణ, పర్యవేక్షణే ఏకైక మార్గం అన్నారు. శబ్దం చేస్తూ మిడతలను తరిమివేయాలని సూచించారు. గాలిలో పురుగుల మందును పిచికారి చేయాలని.. దాని ద్వారా వీటి ప్రభావం తగ్గుతుందని తెలుపుతున్నారు.