మిడతల నియంత్రణ బృందం రాజస్తాన్ బార్డర్లో భారీగా మిడతల గుడ్లు ఉన్నట్లు కనుక్కొన్నారు. ఇవి ఆవిర్భావ ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. మిడతలు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతాయని, కోట్ల సంఖ్యలో ఒకేసారి దాడి చేస్తాయని తెలుపుతున్నారు. ఇది ప్రమాదానికి సంకేతం అని భావిస్తున్నారు.
మనలో చాలా మంది 2020 సంవత్సరాన్ని తిట్టుకునే ఉంటాము. కరోనాని తీసుకొచ్చి మా మధ్య వదిలింది. ఇది చాలా బ్యాడ్ ఇయర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి ఉంటాము. కానీ.., ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే 2020 కన్నా 2021 చాలా కఠినంగా ఉంది. పోయింది అనుకున్న కరోనా వేరియంట్స్ రూపంలో తిరిగి వచ్చింది. ఇక దీనికి బంధువులా అన్నట్టు.., బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యల్లో ఫంగస్ పుట్టుకొచ్చాయి. ఇక మరో […]