లవ్ అనేది వయసుతో సంబంధం లేకుండా పుడుతుంది. అది ఏ వ్యక్తుల మధ్య అయినా కావొచ్చు. ఇక ఓ విద్యావంతురాలైన మహిళా టీచర్ ఓ అమాయకుడి ప్రేమ వలలో పడి అతగాడి అసలు విషయం తెలిసే సరికి పంతులమ్మ షాక్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే..కేరళ రాష్ట్రంలో ఇరవన్నూరు నివాసి అయిన రంజిత్ ఓ యువకుడు ఒకానొక కార్యక్రమంలో ఓ రోజు టీచర్ ను చూశాడు. దాంతో అనుకోకుండా ఆ టీచర్ కూడా పొరపాటున అతగాడి వంక చూస్తూ నవ్వింది. దీంతో మనోడికి ఎక్కడలేని సంతోషం ఒక్కసారిగా ఆయన ముందు వాలిపోయింది. ఎలాగైన ఆ టీచర్ ని ముగ్గులోకి దింపాలని అనుకున్నాడు.
ప్రతి రోజు ఆమె వెంట పడుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తున్నాడు. అనుకోకుండా ఒకరోజు ఆ పంతులమ్మ ఆ యువకుడిని ఎందుకు అలా నా వెంట పడుతున్నావని నిలదీసింది. నువ్వంటే నాకిష్టం అని చెప్పాడు. దీంతో ఆ టీచర్ నాకు ఆల్రడీ నాకు పెళ్లి అయ్యిందని చెప్పుకొచ్చింది. అయినా సరే మనోడు నాకు నువ్వే కావాలంటూ ప్రాధేయపడ్డాడు. అయినా సరే దానికి టీచర్ ఒప్పుకోలేదు. అలా ప్రతి రోజు వెంబడి పడటంతో విసుగొచ్చి…సర్లే అని మాట్లాడటం మొదలుపెట్టింది.
దీంతో కొన్ని రోజులు అలాగే ఇద్దరు మాట మాట కలిపారు. ఇక ఇద్దరి మధ్య స్నేహం బలంగా మారింది. ఇక ఒక రోజు రంజిత్ అసలు విషయం తెలిసి టీచరమ్మ షాక్ గురైంది. ఇక విషయం ఏంటంటే…ఆ యువకుడుకి ఇప్పటికే ఓ అమ్మయితో ఎఫైర్ నడుస్తూనే ఉందని తెలుసుకుంది. దీంతో ఆ టీచర్ అతనితో కలవటం మానేసింది. అప్పటి నుంచి మనోడు ఆమెపై కోపం పెంచుకుని సీక్రెట్ గా ఫొటోలు తీసి భయపెట్టడం మొదలు పెట్టాడు. దీంతో ఆ టీచర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మనోడు కాస్త కటకటాల పాలయ్యాడు.