అమ్మను మించి దైవమున్నదా.. అనే మాట ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అమ్మ ప్రేమ గురించి ఎంత వర్ణించినా.. ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. ఎంత అనుభవించినా ఆ మాధుర్యం తక్కువే అనిపిస్తుంది. ఎంత పొందినా తనివి తీరదు. ఆఖరికి దైవం కూడా అమ్మ ప్రేమను పొందడానికి సామాన్యులుగా జన్మిస్తారు. ఇక అమ్మ ప్రేమకు ఎవరైనా కరిగిపోవాల్సిందే. కరుడుగట్టిన ఉగ్రవాదులు కూడా తల్లి ప్రేమకు కట్టుబడాల్సిందే. ఇదే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. అమ్మ ప్రేమ ఆ కరుడుగట్టిన ముష్కరులను కదిలించింది. దాంతో గన్ను వదిలి.. లొంగిపోయారు. ఆ వివరాలు..
జమ్ము కశ్మీర్లో నిత్యం ఉగ్రవాదులకు సంబంధించిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటాయి. కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుంది. అటు భద్రతా దళాలు, ఇటు పోలీసులు మధ్య సామాన్యులు నలిగిపోతుంటారు. ముష్కరులను మట్టుపెట్టడానికి భద్రతా దళాలు నిత్యం సోదాలు జరుపుతుంటారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో నక్కి ఉన్న ఇద్దరు ముష్కరులను వినూత్న రీతిలో లొంగిపోయేలా చేశారు భద్రతా దళాలు. వారి తల్లిదండ్రులను పిలిపించి.. మాట్లాడించడంతో ముష్కరులు లొంగిపోయారు. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో భాగంగా ఓ ఇంట్లో ఇద్దరు ముష్కరులు నక్కీ ఉన్నారని భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే నిందితుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. వారిని సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి: Breast Milk For Sale: తల్లి పాలకు వెలకడుతోన్న సంస్థ.. అనుమతులు లేకుండా భారత్లో వ్యాపారం!
అక్కడకి చేరుకున్న ముష్కరుల తల్లిదండ్రులు వారితో మాట్లాడి.. బతిమిలాడటంతో వారిద్దరూ మనసు మార్చుకుని లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారి నుంచి ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన ఇద్దరు ముష్కరులు ఇటీవలే ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదుల అలజడి ఉందని.. అందుకే ఇంకా ఆపరేషన్ను కొనసాగిస్తున్నట్లు భారత బలగాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్ చేయకుండా ఇద్దరి ప్రాణాలను రక్షించామని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ పెట్టుకున్న బ్రాండెట్ వాచ్ గురించి తెలిస్తే.. ఔరా అంటారు!
ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని.. హింసా మార్గానికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలని ఆయన సూచించారు. ఈ రోజు ఇద్దరి ప్రాణాలు రక్షించినట్లే తల్లిదండ్రులు సహకరిస్తే వందల మంది ప్రాణాలను కూడా కాపాడవచ్చని విజయ్కుమార్ పేర్కొన్నారు. మరి ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తన పిల్లలని ప్రభుత్వ బడిలో చేర్పించిన ఐఏఎస్ ఆఫీసర్!
#WATCH | Kulgam, J&K | Parents request sons-turned-terrorists to drop weapons, surrender
An encounter started at Hadigam area of Kulgam in the morning where two terrorists had surrendered upon appeal by parents & police. Incriminating materials, arms & ammunition were recovered. pic.twitter.com/Ajllgv6Ebw— ANI (@ANI) July 6, 2022