ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.
విద్యార్థులకు వేసవి సెలవులు ముంగిపు దశకు చేరుకున్నాయి. మరి కొన్ని రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభంకానున్నాయి. ఇన్నిరోజులు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు అప్పుడే సెలవులు అయిపోయాయా అని ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇకపోతే విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మండుటెండల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తే ఏ ఆపద ముంచుకొస్తుందో అని ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో పిల్లలను స్కూల్స్ కి పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మరి దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో అని విద్యార్థులు, తల్లిదండ్రులు వేచిచూస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో పాఠశాలల్లో మొదలైన ఎండాకాలం సెలవులు మరికొద్ది రోజుల్లో ముగియనున్నాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ దానికి సంబందించిన ఏర్పాట్లను చేస్తుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. త్వరలో స్కూల్స్ ప్రారంభం కానుండడంతో తమ పిల్లలను బడికి పంపించాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వేసవి కాలం అయిపోవస్తున్నప్పటికి ఎండలు దంచికొడుతుండడంతో పిల్లలను స్కూల్ కు ఇప్పుడే పంపించాలా లేదా కొన్ని రోజులు ఆగి ఎండలు తగ్గాక పంపించాలా అనే సందిగ్థంలో పడిపోయారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో స్కూల్స్ ఓపెన్ చేస్తే విద్యార్థులు ఎండవేడిమికి తట్టుకోలేక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రప్రభుత్వాలు వేసవి సెలవులను పొడిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాఠశాల విద్యాశాఖ పాఠశాలల పున:ప్రారంభంపై పై ఆలోచనలు చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎండల తీవ్రత దృష్ట్యా ఇంకా కొన్ని రోజులు సెలవులను పొడిగిస్తే బాగుండనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిపుణులు కూడా విపరీతమైన ఎడల్లో పిల్లలను స్కూల్ కు పంపిస్తే డీ హైడ్రేషన్, వడదెబ్బలకు గురై అనారోగ్యాల భారిన పడతారని సూచిస్తున్నారు. ఎండలు కాస్త తగ్గాకే స్కూల్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందని వైద్య, విద్యారంగానికి చెందిన నిపుణులు సూచనలు చేస్తున్నారు. మరి ఈ విషయం పై ఇరు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.