ప్రభుత్వం ఉద్యోగం పొందాలనుకునే వారికి, ఆత్మవిశ్వాసం కోల్పోయి మనోవేదనతో బాధపడేవారికి అతడే జీవితమే స్ఫూర్తి. సుడిగుండ లాంటి మానసిక సంఘర్షణలను ధైర్యంగా ఎదుర్కొన్ని విజయతీరాలకు చేరారు. అతనే కేరళకు చెందిన యువ ఐపీఎస్ అధికారి షెహన్ షా.
ఈ సమాజం పోరాడి ఓడిన వాడిని అస్సలు గుర్తుపెట్టుకోదు. విజయం సాధించిన వారిని మాత్రమే సమాజం గుర్తిస్తుంది, ప్రశంసిస్తుంది. అయితే అలా విజయం సాధించాడనికి వెనుకు వారు పడిన కష్టాలు, ఇబ్బందులు, కోల్పోయిన క్షణాల గురించి ఎవరు పట్టించుకోరు. అలా ఎన్నో కష్టాలు పడి, ఇబ్బందులు ఎదుర్కొన్ని , సమాజం నుంచి ఎదురై అవమానాలను భరించి విజేతలుగా నిలిచినవారు ఎందరో ఉన్నారు. వారు నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారి జాబితాలో చేరారు కేరళకు చెందిన కె.ఎస్. షెహన్ షా. సివిల్ సాధించాలనే అతి ఆశయంతో ఆరో సార్లు ప్రయత్నించి..విఫలం చెందాడు. అయిన పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నంచి ఏడో ప్రయత్నంలో విజయం సాధించారు. మరి.. ఆయన విజయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ కు చెందిన షెహన్ షా కె.ఎస్ 1991లో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదివేవారు. అలా ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజిల్లో మెకానికల్ బ్రాంచ్ లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అథ్లెటిక్స్ లో శిక్షణ పొంది ఎనిమిదేళ్లలో 30 రాష్ట్ర, 14 జాతీయ స్థాయి పతకాలను సాధించారు. అనంతరం సీఐఎస్ఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వహించారు. ఇండియన్ రైల్వేలో కూడా డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఐఆర్పీఎఫ్ఐ 48వ బ్యాచ్ శిక్షణలో బస్ట్ ఇండోర్, బెస్ట్ అవుట్ డోర్, బెస్ట్ ఓవరాల్ ప్రొబేషనర్ గా అవార్డులు పొందారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగం లో చేరి.. ఎంతో సుఖంగా ఉన్నా కూడా .. మనస్సు మాత్రం ఐపీఎస్ కావాలనే కోరుకుంది. ఆ కల చాలా కాలం పాటు అతడిని వెంటాది.
ఓ వైపు సీఐఎస్ఎఫ్ ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. మొదట్లో రోజుకు 10-12 గంటల పాటు చదువులో నిమగ్నమైనా.. తర్వాత కొలువు కారణంగా 4 నుంచి 6 గంటల పాటే చదవాల్సి వచ్చింది. అలా ప్రిపేర్ అవుతూ.. ఆరు సార్లు మెయిన్స్ కు ఎంపికయ్యారు. అందులో నాలుగు సార్లు ఇంటర్వ్యూ దగ్గరే ఆగిపోయారు. అయినా నిరుత్సాహం చెందకుండా, ఆత్మవిశ్వాసంతో 30 ఏళ్ల వయసులో ఏడో సారి ప్రయత్నం చేశారు. ఈ సారి తన గురి తప్పలేదు. అనుకున్న కలను సాకారం చేసుకున్నారు. ఐపీఎస్ 74వ ఆర్ఆర్ బ్యాచ్ లో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని..త్వరలో విధులు నిర్వహించనున్నారు.
ఇక తన విజయం గురించి షెహెన్ షా మాట్లాడుతూ.. కష్టపడే తత్వం, పట్టుదల ఈ రెండే విజయానికి మార్గాలని తాను నమ్మినట్లు, అందుకే సివిల్స్ లో ఆరు ప్రయత్నాల్లో విఫలమైన ఏడో ప్రయత్నంలో 142వ ర్యాంకు సాధించానని ఆయన తెలిపారు. ఐఏఎస్ దక్కే అవకాశమున్నా పోలీస్ ఉద్యోగం పై ఉన్న ఇష్టంతో ఐపీఎస్ ను ఎంచుకున్నానని ఆయన తెలిపారు. ఒకటి, రెండు ప్రయత్నల్లోనే విఫలమై..నిరాశలో కూరకపోయే యువతకు ఆయన స్టోరీ స్ఫూర్తి నిస్తుంది. మరి.. పట్టు వదలని ఈ విక్రమార్కుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.