మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ‘అంబక ‘మంటే ‘నేత్ర’ మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని – అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి – అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. ‘త్రయంబకం యజామహే – సుగంధిం పుష్టి వర్ధనమ్’ మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర గలదు. ఇక జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉండటంతో.. భక్తుల రాకతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇంతటి మహాన్విత క్షేత్రంలో తాజాగా ఓ అద్భుతం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరాయంలో అద్బుత ఘటన జరిగింది. శివలింగం చుట్టు మంచు వ్యాపించింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజు పూజలో భాగంగా పూజారులు పూజ చేయటానికి ఆలయంలో వెళ్లారు. లింగం చుట్టు తెల్లగా ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత.. అక్కడ తాకి చూశారు. శివలింగం మీద గట్టిగా మంచు ఏర్పడి ఉంది.
గర్భగుడిలోని ఆలయంలో లింగం చుట్టు మంచు వ్యాపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సంఘటనను పూజారులు అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. పూజారీ శివలింగం చుట్టు పువ్వులు పెట్టి అలంకరించారు.
ఆలయ పూజారులు.. శివలింగం పక్కన కూర్చుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భారత్, చైనా యుధ్దం తర్వాత.. అనగా..1962లో ఇలాగే నాసిక్ లో.. శివలింగం చుట్టు మంచు వ్యాపించిందని కథలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతం మరోసారి లింగం మొత్తం మంచుతో కప్పబడింది. అయితే, అస్సాంలో వరదలు నేపథ్యంలో.. ఇప్పుడు మరోసారి శివలింగం చుట్టు మంచు వ్యాపించినట్లు భావిస్తున్నారు. దీన్ని చూస్తేందుకు భక్తులు తరలి వస్తున్నారు.
त्र्यंबकेश्वर मंदिर ज्योतिर्लिंगातील महादेवाच्या स्वयंभू शिवलिंगात बर्फ गोठला हा एक नैसर्गिक चमत्कार आहे, तो कधीच घडला नाही अमरनाथ यात्रेला आजपासून सुरुवात झाली असून, त्र्यंबकराजमध्ये देवानेच भक्तांना दर्शन दिल्याची लोकांची श्रद्धा आहे. ❤️🙏 pic.twitter.com/XVFf6VXGuU
— Narendra Aher 🗨 (@aher_narendra) July 1, 2022
మన దేశంలో జమ్ముకశ్మీర్లోని అమర్నాథ్ గుహలో అమరేశ్వర్ మహాదేవ్ రూపంలో మంచు శివలింగం ఉంటుంది. ఈ మహాశివుడిని దర్శించుకునేందుకు ప్రతి ఏడాదిలో వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. కరోనా కారణంగా పవిత్ర అమర్ నాథ్ యాత్ర రెండేళ్ల విరామం తర్వాత మొదలైంది. జూన్ 30న ప్రారంభమైన ఈ యాత్ర సమయంలో త్రయంబకేశ్వర ఆలయంలోని శివలింగంపై మంచు ఏర్పడటమనేది మహా అద్భుతమని, అది శివుని మహిమే అని నెటిజన్లు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.