దేశంలో 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఉన్నారని చెబుతుంటారు పెద్దలు. ఒక్కో దేవత లేదా దేవుళ్లకు ఒక్కో ఇతిహాస గాధ, ఇతర ఆధ్యాత్మికత కథలతో ముడిపడి ఉంటాయి. వాటికంటూ ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. మహిమలు ఉన్నాయి.
మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ‘అంబక ‘మంటే ‘నేత్ర’ మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని – అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి – అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. ‘త్రయంబకం యజామహే – సుగంధిం […]