రాజకీయ నాయకుల దృష్టిలో సామాన్య ప్రజలు అంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చే ఓటర్లు. ఎన్నికల వేళ జనాలు చుట్టూ తిరిగామా.. గెలిచామా.. ఇక చాలు. ఆ తర్వాత జనాలు ఏమైపోయినా వారికి పట్టదు. కానీ కొందరు నేతలు మాత్రం ప్రజల పట్ల ప్రేమను, తమను గెలిపించినందుకు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇక ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ముందుకు వస్తారు. తాజాగా ఓ సీఎం.. పేషెంట్ కోసం తన చాపర్ పంపి మంచి మనసు చాటుకున్నారు. మరి ఎవరా సీఎం అంటే..
సాధారణంగా రాజకీయ నాయకులు అంటే వారి కోసం సామాన్య ప్రజలు పడిగాపులు కాయాలి. ఇక వారు బయటకు వచ్చే సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ ఆపేస్తారు. మన దగ్గర రాజకీయ నాయకులు అంటే.. దైవాంశ సంభుతులు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అయితే అక్కడక్కడ కొందరు మానవత్వం ఉన్న నేతలు కూడా ఉంటారు. ప్రజలు ముందు.. తర్వాతే మేం అనుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడటం కోసం ముఖ్యమంత్రి ఒకరు స్వయంగా తన అధికారిక హెలికాప్టర్ను పంపి.. మంచి మనసు చాటుకున్నారు. సదరు సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. నాయకుడంటే మీలా ఉండాలి సార్… గ్రేట్ సీఎం సాబ్ అంటున్నారు. మరి ఇంతకు ఏ రాష్ట్ర సీఎం ఇలా గొప్ప మనసు చాటుకున్నారో తెలియాలంటే..
మంచి మనసు చాటుకున్న ఆ ముఖ్యమంత్రి.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్. ఇక ఈ సంఘటన చంబా జిల్లా పంగి సబ్ డివిజన్లో చోటు చేసుకుంది. కిల్లార్కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే బాధితుడు నివాసం ఉంటున్న పంగి ఏరియా ఆస్పత్రిలో సరైన వసతులు లేకపోవడంతో సదరు పేషెంట్ను మెరుగైన వసతులున్న మరో హాస్పిటల్కు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ విషయం కాస్త సీఎం దృష్టికి వెళ్లడంతో.. వెంటనే మంచి మనసుతో స్పందించిన సుఖ్విందర్ సింగ్ తన పర్యటనను రద్దు చేసుకొని మరీ తన అధికారిక చాపర్ను పేషెంట్ కోసం పంపించారు.
ఈ క్రమంలో సదరు పేషెంట్ను కంగ్రా జిల్లాలోని టండా మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాపర్ పంపడమే కాక.. సదరు పేషెంట్కి ఉచితంగా, మెరుగైన చికిత్స అందించాలని.. అతడికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం సుఖ్వీందర్ సింగ్.. హాస్పిటల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఈ మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సరిపడా డాక్టర్లను నియమించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తగిన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఓ పేషెంట్ కోసం ఏకంగా తన అధికారిక చాపర్ పంపి మంచి మనసు చాటుకున్న సీఎం సుఖ్వీందర్ తీరుపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి నేతలు రాజకీయాల్లో చాలా అవసరం సార్.. ప్రజలు ముందు.. తర్వాతే నేను అని నిరూపించారు అంటూ ప్రశంసుల కురిపిస్తున్నారు. ఇక పేషెంట్ సోదరుడు ప్రీతమ్ లాల్ సీఎంకు ధన్యవాదాలు తెలపడమే కాక.. తాము జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటామని వెల్లడించాడు. సీఎం సుఖ్వీందర్ తమ పాలిట రక్షకుడిగా వర్ణించారు ప్రీతమ్ లాల్.
Himachal Pradesh | A patient in serious condition was airlifted from Killar in Chamba district in CM Sukhvinder Singh Sukhu’s chopper & was shifted to Tanda medical college. CM Sukhu directed hospital authorities to provide free treatment to the patient. pic.twitter.com/Y970AYqGFp
— ANI (@ANI) February 14, 2023
గత ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ.. మొత్తం 68 సీట్లకు గానూ కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం.. సుఖ్విందర్ సింగ్ సుఖును హిమాచల్ ప్రదేశ్ సీఎంకగా ప్రకటించింది. డిసెంబర్ 11న ఆయన హిమాచల్ ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి నేడు సీఎం స్థాయికి ఎదిగారు సుఖ్వీందర్ సింగ్.
ఇక సుఖ్వీందర్ తండ్రి డ్రైవర్గా పని చేసేవారు. కుటుంబానికి సాయం చేయడం కోసం సుఖ్వీందర్ రకరకాల పనులు చేసుకుంటూ చదువుకొనసాగించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి పదవి కోసం ఇతర నేతలు సైతం పోటీ పడినప్పటికీ.. క్లీన్ ఇమేజ్, విశ్వసనీయత కారణంగా సుఖిందర్కు సీఎం పగ్గాలు దక్కాయి. మరి సుఖ్వీందర్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.