60 ఏళ్ల ఇంటి పెద్ద దిక్కు మరణించాడనే వార్త కొడుకులతో పాటు బంధువులనందరినీ కన్నీరు పెట్టించింది. ఊరంత వచ్చారు.. శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక చివరికి ఎలాగో అంత్యక్రియలు చేయాలి కాబట్టి దానిని కూడా కానిచ్చారు. ఇక 24 గంటలు గడిచింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామనే బాధతో అంతా ఇంటిముందు కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అటు నుంచి వస్తున్న వ్యక్తిని చూసి ఏడుస్తున్నవాళ్లంత ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం జరుగుతుందని చూసేలోపే కొన్ని నమ్మలేని అద్భుతాలు వారి కళ్లముందు తేలియాడాయి.
కానీ ఇక్కడ షాకింగ్ సీన్ ఏంటంటే? నడిచివచ్చింది ఎవరో కాదు చనిపోయాడనుకుంటున్న వారి ఇంటి పెద్దదిక్కు. వినటానికి మీకూ ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని ఈరోడ్లోని బనగలద్పూర్ అనే ప్రాంతం. ఇదే ఊర్లో మూర్తి అనే పెద్దమనిషి కుటుంబంతో పాటు కలిసి జీవిస్తున్నాడు. ఎండకాలం కావడంతో వారి ప్రాంతంలో పెద్దగా పనులు దొరకవు. దీని కారణంగానే ఇటీవల మూర్తి కుటుంబాన్ని వదిలి పని నిమిత్తం త్రిపూర్ వెళ్లాడు.
అలా వెళ్లిన కొన్ని రోజులకే మూర్తి మరణించాడనే వార్త కుటుంబ సభ్యులకు అందింది. చనిపోయింది మూర్తేనంటూ అందరూ అనుకున్నారు. ఇక చేసేదేం లేక అంత్యక్రియలు కూడా చేశారు. ఓ రోజు గడిచింది. దీంతో తర్వాత రోజు బంధువులంతా ఇంటి వద్దే ఏడుస్తూ కూర్చున్నారు. అటు నుంచి అచ్చం మూర్తిలాగే ఉన్న ఓ పెద్ద మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ సీన్ ను చూసి బంధువులతో పాటు ఊరంత కాస్త షాక్ కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: పింఛన్ డబ్బులు తీసుకుని ప్రియురాలితో పరారైన వాలంటీర్!
కానీ చనిపోయింది మూర్తి కాదని మాత్రం కుటుంబ సభ్యులు అంతా తెలుసుకున్నారు. అసలు చనిపోయింది ఎవరు?. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వీళ్లకు ఇవ్వడం ఏంటనే విషయాలు తెలుసుకునందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఈ కేసుపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తుండంతో మరింత సమచారం తెలియాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.