”పెళ్లి అంటే అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూడాలంటారు” పెద్దలు. కానీ నేటి ఆధునిక యూగంలో ఇలాంటివేమీ లేవు. వచ్చమా.. చూశామా.. నచ్చిందా? అంతే పెళ్లి జరిగిపోవాల్సిందే. అయితే విడాకులు కూడా అలాగే జరుగుతున్నాయి అనుకోండి అది వేరే విషయం. ప్రస్తుతం అంతా మ్యాట్రీమోనిల హవా నడుస్తోంది. అయినప్పటికీ పెళ్లి విషయంలో 700 ఏళ్ల క్రితం నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ఓ గ్రామం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణంగా పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిల కోసం అబ్బాయిలను వెదకడం తల్లిదండ్రుల బాధ్యత. గతంలో అయితే.. తమ బంధువుల్లోనో, లేదా తెలిసిన వారినో అడిగి అబ్బయిలను వెతికి పెళ్లి చేసేవారు. ప్రస్తుతం న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇస్తున్నారు. వరుడు కావలెను.. వధువు కావలెను అని. అయితే బిహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలో మాత్రం పెళ్లి వయసు వచ్చిన అబ్బయిలను అంగట్లో పెట్టి వస్తువులను అమ్మినట్లు అమ్ముతున్నారు. పైగా ఇది వారు 700 ఏళ్లుగా కొనసాగిస్తున్న సాంప్రదాయంగా చెబుతున్నారు.
మధుబని జిల్లాలోని పెళ్లికి సిద్ధపడిన యువకులు తమ వారితో ఓ రాగి చెట్టు కిందికి వస్తారు. దానిని ‘సౌరత్ సభ’ అంటారు. ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు పెళ్లి కొడుకులను ఇలా అమ్మాకానికి పెడతారు. దీంతో అక్కడికి మైథిల్ బ్రాహ్మణ కులానికి చెందిన వారు పెళ్లి కావాల్సిన కుమార్తెలతో పాటు వచ్చి తమకు నచ్చిన యువకులను ఎన్నుకుంటారు. యువకునికి సంబంధించిన అన్ని అర్హతలను తెలుసుకున్నాకే పెళ్లి వరకు వ్యవహారం వెళ్తుంది. కట్నకానుకలు సైతం ఉంటాయని అక్కడి స్థానికులు తెలిపారు.
ఈ సంప్రదాయాన్ని కర్నాట్ రాజవంశస్థులు కాలం నుంచి ఆచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజా హరిసింగ్ గోత్రాల, వ్యక్తుల మధ్య వివాహాలను సులభతరం చేయడానికే ఈ మార్కెట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో వరకట్న రహిత పెళ్లిళ్ళు చేయడం మరో లక్ష్యంగా ఆయన వెల్లడించారు. మరి అంగట్లో పెళ్లి కొడుకులను అమ్మడం లాంటి వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Groom market’
In this unique 700-year-old tradition, the aspiring husbands stand in public display,
Village famous for its ” annual “groom market” in India’s Bihar state -in Madhubani district
Dowry though illegal in India, is prevalent and has a high social acceptance pic.twitter.com/G5428fE2Kz
— Elmi Farah Boodhari (@BoodhariFarah) August 4, 2022