కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ యోజన ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6000/- ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. ఇప్పటివరకు 11 విడతలుగా పైసలు జమ కాగా, త్వరలో 12వ విడత డబ్బులు కూడా కూడా అన్నదాత ఖాతాల్లో పడనున్నాయి. ఈ తరుణంలో రైతులనుద్దేశించి కేంద్రం కీలక ప్రకటన చేసింది.
ఇప్పటికే, అనేకసార్లు పీఎం కిసాన్ నిధుల కోసం, ఈ-కేవైసీ చేసుకోవాల్సిందిగా కేంద్రం రైతులను కోరింది. మునుపటి గడువు తేదీ జులై 31 పూర్తయినా, కొందరు రైతులు ఇంకా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గడువును మరోసారి పొడిగించింది. పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం 31 ఆగస్టు 2022 వరకు గడువు పొడిగించింది. PMkisan.gov.in వెబ్సైట్ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు.
ఈ-కేవైసీ ప్రక్రియను ఆన్లైన్లో..
ఈ-కేవైసీ ప్రక్రియను ఆఫ్లైన్లో..
ఆగస్టు 31లోపు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకుంటే, పీఎం కిసాన్ తదుపరి విడతను అందుకునేందుకు అనర్హులవుతారు. మరోసారి పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద.. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరంలో మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడతను ఆగస్టు 1 నుంచి 30 నవంబర్ మధ్య, మూడవ విడత మెుత్తాన్ని డిసెంబర్ 1 నుంచి 31 మార్చి లోపు అందించింది. వీటిని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. వచ్చే నెల మొదటి వారంలో 12 విడత నగదు జమ కావచ్చని తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
ఆధార్ కీలకం
ఈ పథకం ద్వారా నగదు పొందాలంటే రైతులు వారి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాంక్ బ్రాంచ్లో డబ్బును జమ చేస్తారు. రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే వెబ్సైట్లోనే మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: పాడి రైతులకు శుభవార్త.. రూ.5 లక్షలు దక్కించుకునే అవకాశం!