మన దేశంలో వ్యవసాయం అనేది అతి ప్రధానమైనది. ఎక్కువ శాతం మంది వ్యవసాయపైన ఆధారపడి జీవిస్తున్నారు. రైతులకు వ్యవసాయంతో పాటు పశు పోషణ కూడా ప్రధానమైనది. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పధకాలు, సంస్కరణలు తీసుకొచ్చాయి. వ్యవసాయం రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంటాయి. అలానే తాజాగా పశు పోషణ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో అవార్డును ప్రారంభించింది. దేశీయ జాతి ఆవులు, గేదేలను ప్రోత్సహించేందుకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ 'రాష్ట్రీయ గోపాల్ రత్న' అవార్డును ప్రారంభించింది. దేశంలోని ఉత్తమ పాడి రైతుకు అవార్డు ఇవ్వనుంది. ఈ అవార్డు కింద ఉత్తమ పాడి రైతుకు రూ.5 లక్షల నగదును బహుమతిగా ఇస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖలు రాష్ట్రియా గోపాల్ రత్న అవార్డుకు సంబంధించిన సన్నాహాకాలు మొదలుపెట్టారు. దేశంలోని ఉత్తమ పాడి రైతును గుర్తించి.. ఎంపిక చేసే ప్రక్రియను ఆయా శాఖలు ప్రారంభించాయి. ఈ అవార్డును జాతీయ పాల దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న ప్రదానం చేస్తారు. డెయిరీ రంగంలో దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ అవార్డు ఇది. ఈ అవార్డుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రీయ గోపాల్ రత్న అవార్డుల కోసం https://awards.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అర్హత తదితర వివరాలను నేషనల్ అవార్డు పోర్టల్ లో చూసుకోవచ్చు. రాష్ట్రీయ గోపాల్ రత్న అవార్డులను మూడు కేటగిరిల్లో ప్రధానం చేస్తున్నారు. మొదటిది దేశవాళీ ఆవు, గేదెల పెంపకం చేసిన ఉత్తమ పాడి రైతుకు బహుమతి ఇస్తారు. ఇక రెండోది కృత్రిమ గర్భధారణ లో పశువుల సంబంధించి ఇస్తారు. ఇక మూడో అవార్డు.. ఉత్తమ డెయిరీ కో ఆపరేటివ్ సోసైటీ, ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లకు ప్రధానం చేస్తారు. దేశీయ ఆవులను, గెదేల జాతులను శాస్త్రీయంగా సంరక్షించడం, అభివృద్ధి చేయడం అనే లక్ష్యంతో "రాష్ట్రీయ గోకుల్ మిషన్ (RGM)" 2014 డిసెంబర్ లో దేశంలో మొదటిసారిగా ప్రారంభించబడింది. అలానే ఈ మిషన్ కిందనే రాష్ట్రీయ గోపాల్ రత్న అవార్డు కూడా అందజేయనున్నారు. పాల ఉత్పత్తి కోసం విశేష కృషి చేసే రైతులను, ఆ రంగంలో పనిచేసే.. వ్యక్తలను , డెయిరీ సంఘాలను ప్రోత్సహించడం జరుగుతుంది. మరి.. ఈకొత్త అవార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: వీడియో: వెంటపడి మరీ అమ్మాయిల కాళ్లు మొక్కిన యువకులు! ఎందుకంటే.. ఇది చదవండి: అత్యంత ప్రజాధరణ పొందిన నేతగా.. ప్రధాని మోదీ నెంబర్ వన్!