పంజాబ్ లోని మొహాలీలో ఒక ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దసరా ఉత్సవాల సందర్భంగా మొహాలీలో ఫేస్-8లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం తిరుగుతున్న జెయింట్ వీల్ 50 అడుగుల ఎత్తు నుండి ఒక్కసారిగా కింద పడిపోయింది. ప్రమాద సమయంలో జెయింట్ వీల్ లో సుమారు 50 మంది కూర్చున్నారు. జెయింట్ వీల్ పిల్లర్ పక్కకి ఒరగడంతో ఒక్కసారిగా వీల్ కిందకు జారిపడింది. దీంతో అందులో ఉన్న జనం ఎత్తున ఎగిరిపడ్డారు. జెయింట్ వీల్ లో ఉన్న అందరికీ గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో 16 మంది మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
Punjab | A swing broke mid-air in Punjab’s Mohali during a fair yesterday and crashed down from a height of 50 feet with nearly 50 people on board. pic.twitter.com/EiOpFx0YmR
— ANI (@ANI) September 4, 2022
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మొహాలీలోని జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అంబులెన్స్, పీసీఆర్ లాంటి సౌకర్యాలు లేవని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తర్వాత నిర్వాహకులు వచ్చారని, పైగా నిర్వాహకులు తాగి ఉన్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. అసలు ఎలాంటి భద్రత, అత్యవసర ఏర్పాట్లు లేకుండా ఎగ్జిబిషన్ ను ఎలా నిర్వహిస్తారని వచ్చినవాళ్లు ప్రశ్నిస్తున్నారు.
హాస్పిటల్ లో జాయినైన వారికి పెద్దగా గాయాలు కాలేదని, సురక్షితంగానే ఉన్నట్టు సివిల్ హాస్పిటల్ డాక్టర్ సుభాష్ మీడియా ముందు వెల్లడించారు. ఇక ఎగ్జిబిషన్ నిర్వహణకు అధికారికంగా అనుమతి ఉందని, నిర్వాహకుల తప్పు నిరూపణ అయితే వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హరిసిమ్రన్ సింగ్ బల్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ఘటనలో తప్పెవరిదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Live Visual of swing breaking in #Mohali phase 8, Many people got injured. Around 16 women & kids were hospitalised after the incident. pic.twitter.com/bay5IfzHLB
— Nikhil Choudhary (@NikhilCh_) September 4, 2022