భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు.. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదాని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రపంచంలోనే కుభేరుల జాబితాలో గొప్ప స్థానం దక్కించుకున్నారు. గౌతమ్ అదాని నిర్మాణ, విమాన, మీడియా, రిటైల్ రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే గౌతమ్ అదాని గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారి పాపను ఆదుకొని తన మంచి మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన నాలుగేళ్ల మనుశ్రీ కి గుండెలో చిన్న రంధ్రం ఏర్పడింది. ప్రస్తుతం ఆ చిన్నారి లఖ్నవూలోని ఓ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. ఆ పాప చికిత్స కు రూ.1.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే మనుశ్రీ తల్లిదండ్రులకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేక బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అషుతోష్ త్రిపాఠి అనే వ్యక్తి మనుశ్రీని ఆదుకోవాలని ఒక యూపీఐ కోడ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త గౌతమ్ అదాని కంట్లో పడింది. వెంటనే ఆయన స్పందించారు.
నాలుగేళ్ల చిన్నారి మనుశ్రీ పరిస్థితి తనను కదిలించిందని.. ఆ పాప పూర్తిగా కోలుకునే వరకు తల్లిదండ్రులతో టచ్ లో ఉండాలని అదాని ఫౌండేషన్ ను ఆదేశించారు గౌతమ్ అదాని. అషుతోష్ త్రిపాఠి ట్విట్ ట్యాగ్ చేస్తూ.. చిన్నారి మనుశ్రీ తిరిగి తన స్నేహితులతో సంతోషంగా ఆడుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. అదాని చాటుకున్న మానవత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇలాంటి గొప్ప మనసు చాటుకొని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారని ట్విట్స్ చేస్తున్నారు.
Manushree will be fine very soon. Have asked @adanifoundation to get in touch with her family and ensure that the family gets all possible help that it needs to get Manushree back to school playing with her friends. https://t.co/t2xoqqvG4e
— Gautam Adani (@gautam_adani) November 13, 2022