దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో రెచ్చిపోతున్న కామాంధులు చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవరినీ వదలడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. అందులో లొసుగులను ఉపయోగించుకొని నింధితులు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో అత్యాచార నింధితులకు కఠిన శిక్షలు విధిస్తే.. మరికొన్ని చోట్ల సాధారణ శిక్షలతో సరిపెడుతుంటారు ఊరి పెద్దలు. ఓ వ్యక్తి ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. ఆ నిందితుడికి ఐదు గుంజీల శిక్షతో సరిపెట్టారు గ్రామ పంచాయితీ పెద్దలు. సభ్యసమాజం తలగించుకునేలా.. న్యాయాన్ని అవహేళన చేసేలా ఉన్న ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బిహార్ నవాదా గ్రామంలో కోళ్లఫారం నిర్వహిస్తున్న అరుణ్ పండిట్ అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి తన ఫౌల్ట్రీ ఫామ్ కి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి జరిగిన విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు. అంతలోనే ఆ దంపతుల వద్దకు వచ్చిన అరుణ్ పండిట్ ఆ విషయాన్ని గ్రామ పంచాయితీ పెద్దల ముందు తేల్చుకోవాలని సూచించాడు.
ఇక్కడే చిన్నారికి దారుణమైన అన్యాయం జరిగింది. అత్యాచార నిందితుడికి 5 గుంజీల శిక్ష విధించారు పంచాయితీ పెద్దలు. బాలికపై అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులు, ఊరి జనాలు చెప్పినప్పటికీ.. ‘బాలికపై అత్యాచారం జరగలేదు.. కానీ ఒంటరిగా చిన్నారిని తీసుకు వెళ్లడం నేరం.. అందుకే ఈ శిక్ష విధిస్తున్నాం’ అంటూ గ్రామ పెద్దలు చెప్పడం కొసమెరుపు. ఇదెక్కడి న్యాయం అంటూ చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పంచాయితీ పెద్దల తీర్పుపై గ్రామస్థులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఊరి పెద్దలు ఇచ్చిన తీర్పు.. అత్యాచార నిందితుడు గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఇప్పటికీ ఇలాంటి నీచమైన న్యాయవ్యవస్థ నడుస్తుంది.. ఈ ఘటన చూస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని.. వీడియోని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కి ట్విట్టర్ అకౌంట్ లో ట్యాగ్ చేశారు. ఈ వ్యవహారంపై పోలీస్ అధికారులు స్పందించారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
#Bihar: Man r#ped a 6 y/o girl in #Kannauj village of Nawada. After the matter came to light, the #Panchayat decided that he should do sit-ups 5 times in front of everyone as punishment. The accused did sit-ups and went away after being acquitted of the charge.
Shame! pic.twitter.com/x2G44xSujK— Ashraf Muhammad (@AshrafMangaluru) November 24, 2022