ఎండకాలం వచ్చిందంటే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. వేసవిలో విపరీతమైన ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి అవుతారు. సీతల పానియాలు, చల్లగా ఉండే ఏసీలు, కూలర్లు తో సేద తీరుతుంటారు. ఎండాకాలంలో అప్పుడప్పుడు భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
దేశంలో ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా ఎండాకాలం భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది.. కొన్ని చోట్ల అగ్రి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. నగరంలోని టిక్రీ కలాన్ లో ఉన్న పీవీసీ మార్కెట్ లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో చుట్టు పక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగ అలుముకుంది. ఎగసి పడుతున్న అగ్ని మంటలను చూసి చుట్టు పక్కల జనాలు భయపడిపోాయరు. వెంటనే స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్లాస్టీక్ గోదాంలో మంటలు వ్యాపించడం వల్ల అందులో ఉన్న ప్లాస్టీక్ వస్తువులన్నీ కాలి బూడిద అయ్యాయి.
ప్లాస్టీక్ కావడం వల్ల దట్టమైన పొగ వ్యాపించిందని పోలీసులు తెలిపారు. ఈ మంటలు దాదాపు కిలో మీటర్ల మేర వ్యాపించడంతో స్థానికులు భయపడిపోయారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకొని ఫైర్ సిబ్బంది 26 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని.. ఎంత ఆస్తి నష్టం వచ్చిందన్న విషయం ఇంకా తెలియరాలేదని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్ కే దువా చెప్పారు.
#WATCH | Delhi: Morning visual from Tikri Kalan area where fire broke out in a plastic godown during the early hours today. 25 fire tenders at the spot. No casualties reported so far. https://t.co/yhTyNp2M4y pic.twitter.com/Clr2ul8CmF
— ANI (@ANI) April 8, 2023