గత కొంతకాలంగా దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో జరిగి మూడు రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది రైలు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం యావత్ భారత దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో వందల మంది చనిపోగా.. వందల మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ రోజు ఒడిశాలో ఉదయం సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ను బి5 బోగీలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సీల్దా-అజ్మీర్ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ కోచ్లలో మంటలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే..
దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశా లోని మూడు రైళ్ల ప్రమాద ఘటన మరువక ముందే వివిధ చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు సికింద్రాబాద్ – అగర్తలా ఎక్స్ ప్రెస్ లో బి5 బోగీలో మంటలు చెలరేగాయి.. ప్రయాణికులు అలర్ట్ అయి రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలుని ఆపివేశారు. ఎయిర్ కండీషన్ లో జరిగి షాట్ సర్క్యూట్ వల్ కోచ్ లో పొగలు అల్లుకున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన మరువక ముందే సీల్దా-అజ్మీర్ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ కోచ్లలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు దిగి పరుగులు పెట్టారు.
సిల్దా – అజ్మీర్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే స్టేషన్ లో నిలిపివేసి, జనరల్ కోచ్ లోని మంటలను దాదాపు 30 నిమిషాల్లో ఆర్పివేసినట్లు స్టేషన్ సూపరిండెంట్ డిఎన్ యాదవ్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటల చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ మధ్యాహ్నం 2 గంటల వరకు గమ్యస్థానం చేరుకుందని.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఒడిశాలో ఓ గూడ్స్ పట్టాలు తప్పింది.. అలాగే చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ లో ఓ బోగీకి పగుళ్లు ఏర్పడటంతో సిబ్బంది గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని దక్షణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
VIDEO | Sealdah-Ajmer Express (Train no. 12987) caught fire earlier today that led to panic among the passengers. The fire was reported when the train was passing through Kaushambi district in Uttar Pradesh. The fire was extinguished and no damage or injury was reported. pic.twitter.com/vtwE7HdgZW
— Press Trust of India (@PTI_News) June 6, 2023