మహా నగరంలో ప్రయాణించాలంటే బెస్ట్ ఆప్షన్ మెట్రో రైలు మాత్రమే. వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్లపై రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు ఆఫీసులకు లేదా ఇతర పనులకు బయటకు వెళ్లాలంటే ట్రాఫిక్ కారణంగా ఆలస్యమౌతుంది. దీంతో చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు.
మహా నగరంలో ప్రయాణించాలంటే బెస్ట్ ఆప్షన్ మెట్రో రైలు మాత్రమే. వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్లపై రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు
ఆఫీసులకు లేదా ఇతర పనులకు బయటకు వెళ్లాలంటే ట్రాఫిక్ కారణంగా ఆలస్యమౌతుంది. దీంతో చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. సుఖవంతమైన ప్రయాణంతో పాటు వేగవంతంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే మెట్రో రైలులో ప్రయాణించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి ఆయుధాలను తీసుకెళ్లరాదు. ప్లాస్టిక్ వినియోగం నిషేధం. అలాగే మద్యం బాటిల్స్, బెలూన్స్ వంటి వాటిని లోనికి తీసుకెళ్లనివ్వరు. అయితే ఇప్పుడు మందు బాబులకు ఫుల్ ఖుషీ అయ్యే వార్త చెప్పింది మెట్రో.
ప్రయాణీకులకు ఇకపై మద్యం బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది ఢిల్లీ మెట్రో కార్పొరేషన్. అయితే ఒక మనిషి రెండు బాటిళ్లను మాత్రమే తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది. మెట్రోలో మద్యం సేవించడంపై నిషేధం మాత్రం కొనసాగుతుందని తెలిపింది. ఇన్నాళ్లూ ఒక్క ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ లైన్లో తప్ప మిగతా మార్గాల్లో చోట్ల మద్యం తీసుకెళ్లడంపై బ్యాన్ విధించిన ఢిల్లీ మెట్రో ఇప్పుడు దాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. దీని కోసం సీఆర్పీఎఫ్, ఢిల్లీ మెట్రో రైల్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, పాత లిస్టుని రివ్యూ చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో అధికారి తెలిపారు. రెండు సీల్డ్ బాటిల్స్ ఆల్కహాల్ ని తీసుకెళ్లేందుకు అనుమతిచినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది.
Hi. Yes 2 sealed bottles of alcohol is allowed in Delhi Metro.
— Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 30, 2023