మహా నగరంలో ప్రయాణించాలంటే బెస్ట్ ఆప్షన్ మెట్రో రైలు మాత్రమే. వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్లపై రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు ఆఫీసులకు లేదా ఇతర పనులకు బయటకు వెళ్లాలంటే ట్రాఫిక్ కారణంగా ఆలస్యమౌతుంది. దీంతో చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు.
ఢీల్లీ మెట్రో ట్రైన్ లో ఇటీవల ప్రయాణికులు చేస్తున్న పిచ్చి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ రీల్, ముద్దూ ముచ్చట్లు.. కొట్టుకోవడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.
మెట్రో ట్రైన్స్ లో ఈ మద్యకాలంలో పలు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెట్రో స్టేషన్ లో డ్యాన్స్ చేయడం, ట్రైన్ లోపల కొన్ని జంటలు అసభ్యంగా ప్రవర్తించడం చూస్తున్నాం.