Draupadi Murmu: 15వ భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ జస్టిస్ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్లు హాజరయ్యారు. ప్రమాణం స్వీకారం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. కాగా, అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ద్రౌపది ముర్ము 25 ఏళ్ల కెరీర్ లో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి స్థానాన్ని అధిరోహించే వరకు ఎదిగారు.
ఒడిశా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్భంజ్(పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంటుది) జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న గిరిజన కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము. వీరిది గిరిజన వర్గంలోని సంథాల్ తెగ. పేదరికపు అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం సాగించిన ద్రౌపది.. భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు. ఆర్ట్స్ విద్యార్థి అయిన ముర్ము.. సాగునీటి-విద్యుత్తు శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు.
రాయ్రంగాపూర్లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. తర్వాత 1997లో రాయ్రంగ్పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్గా.. 2000 సంవత్సరంలో రాయ్రంగ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా.. 2010, 2013లో రెండుసార్లు మయూర్భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా..2013లో ముర్మును బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా.. 2015 మే 18న జార్ఖండ్ గవర్నర్గా ఇలా ఎన్నో బాధ్యతల్ని నిర్వర్తించారు. మరి, ద్రౌపది ముర్ము స్పూర్తిదాయక జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పెంపుడు చిలుకను పట్టి తెచ్చినందుకు రూ.85 వేల రివార్డు! ఎక్కడంటే..