బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయాని సందర్శించారు. అయితే ద్రౌపది ముర్ము పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రామప్పలో ఏర్పాటు చేసిన లైవ్ ఎల్ఈడీ స్క్రీన్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పొగను అదుపు చేశారు. ఈ షార్ట్ సర్క్యూట్ ఘటనతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. శీతకాల నిడివికి కోసం రాష్ట్రపతి హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం వరంగల్ లోని రామప్ప ఆలయంలో పర్యటిస్తున్నారు.
ఇటీవలే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో భాగంగా ఆమె ఏపీ, తెలంగాణల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము డిసెంబర్ 26న నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నారు. అలానే ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కొ గుర్తింపు పొందిన వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం పర్యాటనకు ద్రౌపది ముర్ము వచ్చారు. ఈ నేపథ్యంలో అపూర్వ స్వాగతం పలికేందుకు ములుగు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భద్రాచలం నుంచి నేరుగా మధ్యాహ్నం 3గంటలకు రామప్పకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. రాష్ట్రపతికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు అపూర్వ స్వాగతం పలికారు.
అనంతరం హెలిప్యాడ్ నుంచి అరకిలో మీటర్ దూరంలో ఉన్న రామప్ప ఆలయానికి 30 కార్లు, జామర్లతో కూడిన ప్రత్యేక కాన్వాయ్ లో రాష్ట్రపతి వెళ్లారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయం, అక్కడి గార్డెను సరికొత్తగా తీర్చిదిద్దారు. గార్డెన్లోని గ్రాస్ వేసి సర్వాంగ సుందరంగా తయారుచేశారు. దారికి ఇరువైపులా అందమైన పూలు, చెట్ల కుండీలతో అలంకరించారు. ఆలయంలో అక్కడడక్కడ ఉన్న గుంతలను ఇసుకతో పూడ్చారు. ప్రధానాలయంలో ఉన్న హుండీలను, ఇతర సామగ్రిని బయట రూమ్లో భద్రపరిచారు. ఇక ఏర్పాట్లు అలా ఉంచితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరంగల్ పర్యటనలో చోటుచేసుకున్న అపశృతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి